ETV Bharat / state

వృద్ధురాలి మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్​

Old women dead: తన భూమిని ఆక్రమించొద్దన్న పాపానికి ఓ వృద్ధురాలిని జేసీబీ తో తొక్కించి చంపారని స్థానికులు తెలిపారు. ఏ మాత్రం మానత్వం లేకుండా జరిగిన ఈ ఘటన విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో జరిగింది. ఓ వృద్ధురాలి భూమిలో ఎలాంటి సమాచారం లేకుండా అంగన్వాడి నిర్మించడానికి ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించింది. దీన్ని అడ్డుకున్న వృద్ధురాలిని గ్రామ సర్పంచ్ తో పాటు కాంట్రాక్టర్ రెవెన్యూ అధికారుల కలిసి చంపించారని దీని వెనక వైకాపా నాయకుల హస్తముందని..సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు.

author img

By

Published : Oct 27, 2022, 5:37 PM IST

వృద్ధురాలి మృతి
a old women dead

Old women dead: విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగు పాలెం గ్రామంలో తన స్థలంలో అంగన్వాడి కేంద్రం నిర్మించొద్దని అడ్డుకున్న వృద్ధురాలు శిణగం ఎల్లమ్మ(80)ను జేసీబీతో తొక్కించి చంపారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆధారంగా మృతురాలి మనవరాలు, సీపీఎం నాయకులు మాట్లాడుతూ ఎల్లమ్మను కావాలనే చంపించారని.. దీని వెనక వైకాపా నాయకుల హస్తముందని ఎల్లమ్మ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన సర్పంచ్ చందక లక్ష్మీతో పాటు కాంట్రాక్టర్ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెంది 24 గంటలు గడిచినా ఇప్పటివరకు చర్యలు తీసుకుపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం అనీ.. మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షలు అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం, నాయకులు ఆర్ఎస్​ఎన్ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది: విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెంలో విషాదం నెలకొంది. అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకున్న శిణగం ఎల్లమ్మ(80) అనే వృద్ధురాలిని జేసీబీతో బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు పాలైన ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

పొడుగుపాలెంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో 10 మంది.. వారసత్వంగా వస్తున్న భూముల్లో పాకలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తామని.. అందరూ ఖాళీ చేయాలని చెప్పడంతో బాధితులంతా జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో నేడు వీఆర్వో అప్పల రెడ్డి.. సచివాలయ సిబ్బందితో కలిసి.. జేసీబీ సాయంతో చదును చేసేందుకు ప్రయత్నం చేశారు. తొలగింపులను వృద్ధురాలు శిణగం ఎల్లమ్మ అడ్డుకోవడంతో.. జేసీబీ డ్రైవర్ నడుపూరు సురేష్ కావాలనే ఆమెను ఢీకొట్టాడని మృతురాలి కుమారుడు ఆరోపించాడు. ఘటనా స్థలానికి ఆనందపురం సీఐ రామచంద్రరావు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ఇవీ చదవండి:

Old women dead: విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగు పాలెం గ్రామంలో తన స్థలంలో అంగన్వాడి కేంద్రం నిర్మించొద్దని అడ్డుకున్న వృద్ధురాలు శిణగం ఎల్లమ్మ(80)ను జేసీబీతో తొక్కించి చంపారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆధారంగా మృతురాలి మనవరాలు, సీపీఎం నాయకులు మాట్లాడుతూ ఎల్లమ్మను కావాలనే చంపించారని.. దీని వెనక వైకాపా నాయకుల హస్తముందని ఎల్లమ్మ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన సర్పంచ్ చందక లక్ష్మీతో పాటు కాంట్రాక్టర్ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెంది 24 గంటలు గడిచినా ఇప్పటివరకు చర్యలు తీసుకుపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం అనీ.. మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షలు అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం, నాయకులు ఆర్ఎస్​ఎన్ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది: విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెంలో విషాదం నెలకొంది. అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకున్న శిణగం ఎల్లమ్మ(80) అనే వృద్ధురాలిని జేసీబీతో బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు పాలైన ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

పొడుగుపాలెంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో 10 మంది.. వారసత్వంగా వస్తున్న భూముల్లో పాకలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తామని.. అందరూ ఖాళీ చేయాలని చెప్పడంతో బాధితులంతా జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో నేడు వీఆర్వో అప్పల రెడ్డి.. సచివాలయ సిబ్బందితో కలిసి.. జేసీబీ సాయంతో చదును చేసేందుకు ప్రయత్నం చేశారు. తొలగింపులను వృద్ధురాలు శిణగం ఎల్లమ్మ అడ్డుకోవడంతో.. జేసీబీ డ్రైవర్ నడుపూరు సురేష్ కావాలనే ఆమెను ఢీకొట్టాడని మృతురాలి కుమారుడు ఆరోపించాడు. ఘటనా స్థలానికి ఆనందపురం సీఐ రామచంద్రరావు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.