ETV Bharat / state

కార్మికుల సార్వత్రిక సమ్మె గోడపత్రిక ఆవిష్కరణ - జనవరి 8న కార్మికుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

కేంద్రం అనుసరిస్తోన్న విధానాలపై.. కార్మిక సంఘాలు మండిపడ్డాయి. జనవరి 8న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు నిర్ణయించినట్లు అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్​ నిర్ణయించాయి. దీనికి సంబంధించిన గోడపత్రికను కార్మిక సంఘాల నాయకులు ఆవిష్కరించారు.

all trade unions meeting on january eighth
జనవరి 8న కార్మికుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
author img

By

Published : Jan 2, 2020, 2:50 PM IST

జనవరి 8న కార్మికుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా జనవరి 8న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె గోడ పత్రికను కార్మిక నాయకులు ఆవిష్కరించారు. అట్టడుగు కార్మికునికి కనీస వేతనం 21 వేల రూపాయలుగా నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల విలీనం చేయవద్దని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను పరిరక్షించాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని... కార్మికులకులందరికీ అమలు చేయాలనే డిమాండ్లతో సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు.

జనవరి 8న కార్మికుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా జనవరి 8న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె గోడ పత్రికను కార్మిక నాయకులు ఆవిష్కరించారు. అట్టడుగు కార్మికునికి కనీస వేతనం 21 వేల రూపాయలుగా నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల విలీనం చేయవద్దని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను పరిరక్షించాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని... కార్మికులకులందరికీ అమలు చేయాలనే డిమాండ్లతో సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు.

ఇదీ చదవండి:

పాయకరావుపేటలో చేనేత కార్మికుల ధర్నా

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_02_all_trade_unions_meet_ab_AP10148

( ) కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జనవరి 8వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్టు జాతీయ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్ లు నిర్ణయించినట్టు సి ఐ టి యు ప్రధాన కార్యదర్శి ఇ ఎన్ జగ్గు నాయుడు ప్రకటించారు.


Body:విశాఖ సిపిఎం కార్యాలయంలో ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ప్రవేశంలో సమావేశం నిర్వహించారు. సార్వత్రిక సమ్మె గోడ పత్రికను కార్మిక నాయకులు ఆవిష్కరించారు. అట్టడుగు కార్మికునికి కనీస వేతనం 21000 నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల విలీనాలు, ప్రైవేటీకరణను విరమించుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని దారిద్ర రేఖకు పైన ఉన్న కార్మికులకు కూడా అమలు చేయాలని పది డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్లు వివరించారు.


Conclusion:ఈ సందర్భంగా విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు,ఉద్యోగుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎం.జగ్గునాయుడు,ప్రధాన కార్యదర్శి,సి.ఐ.టి.యు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.