ETV Bharat / state

విశాఖకు ‘అదాని డేటా సెంటర్‌ టెక్నాలజీ పార్క్‌’ సాకారం

author img

By

Published : Nov 5, 2020, 3:09 PM IST

‘అదాని డేటా సెంటర్‌ టెక్నాలజీ పార్క్‌’ ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. తొలుత అంచనా వేసిన విధంగా రూ. 70 వేల కోట్ల పెట్టుబడి కాకుండా రూ.14,634 కోట్ల పెట్టుబడికి మాత్రమే అదాని సంస్థ అంగీకరించింది. గత ఒప్పందంలో ఐదు వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటు నిర్మాణం ఉండగా.. తాజా ప్రాజెక్టులో భాగంగా దాన్ని నిర్మిస్తారా? లేదా? అన్న అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

ADANI DATA CENTER
ADANI DATA CENTER

భూమి ఎక్కడ కేటాయిస్తారు?:

అదాని సంస్థకు గతంలో 175 ఎకరాల భూమిని కాపులుప్పాడ కొండపై కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా మధురవాడలోని స్థలాన్ని కేటాయిస్తారని ప్రకటించారు. దీంతో మధురవాడలో ఎక్కడ? ఎంత? భూమిని కేటాయిస్తారన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. డేటా సెంటర్‌ పార్క్‌లోని సంస్థల కోసం పర్యావరణానికి అత్యంత అనుకూలమైన విద్యుత్తును దశలవారీగా సరఫరా చేయాలని, ఫలితంగా ఆయా సంస్థల కారణంగా పరోక్షంగా కూడా కాలుష్యం విడుదలవడానికి అవకాశం ఉండదని భావించారు.

ప్రాజెక్టు విలువను తగ్గించడంతో అత్యంత కీలకమైన సౌర విద్యుత్తు ప్లాంట్‌ వస్తుందా? రాదా? అన్నది తేలాల్సి ఉంది. డేటా సెంటర్‌, ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ పార్క్‌, రిక్రియేషన్‌ సెంటర్‌లతోపాటు నైపుణ్య విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయనుంది. గత ప్రాజెక్టులో లేని ‘నైపుణ్య విశ్వవిద్యాలయం’ కొత్తగా చేరింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

మధురవాడలో ఎక్కడ?

ఈ ప్రాజెక్టుకు గత సంవత్సరం.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వం మారడం, ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందంలోని అంశాల్లోనూ మార్పులు చేర్పుల ప్రక్రియ జరగడంతో పనులు ప్రారంభం కాలేదు. తాజాగా ప్రభుత్వ ఆమోదం లభించగా.. నగరానికి ఒక భారీ ప్రాజెక్టు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. భూమిని ఎక్కడ కేటాయిస్తారన్న అంశంపై ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మధురవాడలో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కచ్చితంగా ఏ సర్వే నెంబర్లలో కేటాయిస్తారన్న అంశంపై స్పష్టత లేదు.

ఇదీ చదవండి:

నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం

భూమి ఎక్కడ కేటాయిస్తారు?:

అదాని సంస్థకు గతంలో 175 ఎకరాల భూమిని కాపులుప్పాడ కొండపై కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా మధురవాడలోని స్థలాన్ని కేటాయిస్తారని ప్రకటించారు. దీంతో మధురవాడలో ఎక్కడ? ఎంత? భూమిని కేటాయిస్తారన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. డేటా సెంటర్‌ పార్క్‌లోని సంస్థల కోసం పర్యావరణానికి అత్యంత అనుకూలమైన విద్యుత్తును దశలవారీగా సరఫరా చేయాలని, ఫలితంగా ఆయా సంస్థల కారణంగా పరోక్షంగా కూడా కాలుష్యం విడుదలవడానికి అవకాశం ఉండదని భావించారు.

ప్రాజెక్టు విలువను తగ్గించడంతో అత్యంత కీలకమైన సౌర విద్యుత్తు ప్లాంట్‌ వస్తుందా? రాదా? అన్నది తేలాల్సి ఉంది. డేటా సెంటర్‌, ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ పార్క్‌, రిక్రియేషన్‌ సెంటర్‌లతోపాటు నైపుణ్య విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయనుంది. గత ప్రాజెక్టులో లేని ‘నైపుణ్య విశ్వవిద్యాలయం’ కొత్తగా చేరింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

మధురవాడలో ఎక్కడ?

ఈ ప్రాజెక్టుకు గత సంవత్సరం.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వం మారడం, ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందంలోని అంశాల్లోనూ మార్పులు చేర్పుల ప్రక్రియ జరగడంతో పనులు ప్రారంభం కాలేదు. తాజాగా ప్రభుత్వ ఆమోదం లభించగా.. నగరానికి ఒక భారీ ప్రాజెక్టు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. భూమిని ఎక్కడ కేటాయిస్తారన్న అంశంపై ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మధురవాడలో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కచ్చితంగా ఏ సర్వే నెంబర్లలో కేటాయిస్తారన్న అంశంపై స్పష్టత లేదు.

ఇదీ చదవండి:

నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.