విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వేల్పుల వీధిలో ఉండే మద్దాల చిన్నారి అనే మహిళ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. ఆమె భర్త రవి కూడా చిరు వ్యాపారం చేస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె తరుణ కుమారి బుద్ధిమాంద్యంతో బాధపడుతోంది. నాగుల చవితి రోజు కుటుంబ సభ్యులంతా కలిసి పుట్టలో పాలు పోయడానికి వెళ్లాలనుకున్నారు . కుమార్తెకు అనారోగ్యంతో ఉందని చిన్నారి రానంది. రానందుకు ఆమెపై కోపడ్డాడు భర్త రవి. అకారణంగా భర్త తిట్టాడని మనస్తాపం చెందిన భార్య చిన్నారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇదీ చదవండీ...పోలీసులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు