ETV Bharat / state

కుటుంబంలో చవితి చిచ్చు... భర్త కోపడ్డాడని భార్య ఆత్మహత్య

author img

By

Published : Nov 19, 2020, 2:58 PM IST

Updated : Nov 19, 2020, 7:20 PM IST

పుట్టలో పాలు పోయటానికి రానందుకు... భర్త కోపగించాడని మనస్తాపం చెంది భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో నాగుల చవితి పర్వదినాన ఆ కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

a-woman-from-anakapalli-in-visakhapatnam-district-has-committed-suicide
కుటుంబంలో చవితి చిచ్చు... భర్త కోపడ్డాడని భార్య ఆత్మహత్య

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వేల్పుల వీధిలో ఉండే మద్దాల చిన్నారి అనే మహిళ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. ఆమె భర్త రవి కూడా చిరు వ్యాపారం చేస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె తరుణ కుమారి బుద్ధిమాంద్యంతో బాధపడుతోంది. నాగుల చవితి రోజు కుటుంబ సభ్యులంతా కలిసి పుట్టలో పాలు పోయడానికి వెళ్లాలనుకున్నారు . కుమార్తెకు అనారోగ్యంతో ఉందని చిన్నారి రానంది. రానందుకు ఆమెపై కోపడ్డాడు భర్త రవి. అకారణంగా భర్త తిట్టాడని మనస్తాపం చెందిన భార్య చిన్నారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వేల్పుల వీధిలో ఉండే మద్దాల చిన్నారి అనే మహిళ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. ఆమె భర్త రవి కూడా చిరు వ్యాపారం చేస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె తరుణ కుమారి బుద్ధిమాంద్యంతో బాధపడుతోంది. నాగుల చవితి రోజు కుటుంబ సభ్యులంతా కలిసి పుట్టలో పాలు పోయడానికి వెళ్లాలనుకున్నారు . కుమార్తెకు అనారోగ్యంతో ఉందని చిన్నారి రానంది. రానందుకు ఆమెపై కోపడ్డాడు భర్త రవి. అకారణంగా భర్త తిట్టాడని మనస్తాపం చెందిన భార్య చిన్నారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చదవండీ...పోలీసులను లక్ష్యంగా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు

Last Updated : Nov 19, 2020, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.