ETV Bharat / state

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

భార్య తనతో గొడవ పడిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా కూడ్రమ్ గ్రామంలో​ జరిగింది.

author img

By

Published : Nov 4, 2020, 11:11 PM IST

a man committed suicide with drink fertilizer
పరుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలోని కూడ్రమ్​ గ్రామంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన యాదగిరి రాము వ్యవసాయ కూలిగా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే వచ్చిన డబ్బును మద్యానికి ఖర్చు చేసేవాడు. దీంతో భార్య వెంకటలక్ష్మి... తాగుడు మానమని వేడుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఫలితంగా మనస్తాపం చెందిన రాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై రామకృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలోని కూడ్రమ్​ గ్రామంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన యాదగిరి రాము వ్యవసాయ కూలిగా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే వచ్చిన డబ్బును మద్యానికి ఖర్చు చేసేవాడు. దీంతో భార్య వెంకటలక్ష్మి... తాగుడు మానమని వేడుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఫలితంగా మనస్తాపం చెందిన రాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై రామకృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.