శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పర్లాం గ్రామ సమీపంలో వంశధార నది ఒడ్డున క్రికెట్ ఆడుతున్న యువకులను పిడుగుపాటు కలవరపరిచింది. నదికి రెండు వైపులా ఉన్న గ్రామాలకు చెందిన 20 మంది యువకులు పర్లాం గ్రామం వద్ద క్రికెట్ ఆడేందుకు శనివారం సాయంత్రం వెళ్లారు.
అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా.. పిడుగులు పడ్డాయి. వారు ఉన్న క్రికెట్ మైదానానికి సమీపంలో పిడుగు పడటంతో.. యువకులంతా నేలపై పడిపోయారు. వీరిలో ఇద్దరు క్రీడాకారులు పిడుగుపాటుతో అస్వస్థతకు గురయ్యారు. మట్ట మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటంతో నరసన్నపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి: