ETV Bharat / state

సభాపతిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: రవికుమార్‌ - శ్రీకాకుళం తాజా వార్తలు

స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, ఈసీ పట్టించుకోవాలని కోరారు.

tdp-leader-kuna-ravi
tdp-leader-kuna-ravi
author img

By

Published : Feb 16, 2021, 10:48 AM IST

తొగరాం పంచాయతీ సర్పంచి బరిలో సీతారాం సతీమణి పోటీలో నిలిచినందున అక్కడ ప్రజలను భయపెట్టి గెలవాలని చూస్తున్నారని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. మందస మండలం బహాడపల్లిలో పక్కనున్న గ్రామాల నుంచి ప్రజలను తీసుకెళ్లి ఓట్లు వేయించారన్నారు. తక్షణమే అక్కడ ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న చోట్ల ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. నగర తెదేపా అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, రాష్ట్ర హస్తకళల సంస్థ మాజీ డైరెక్టర్‌ ఇప్పిలి తిరుమలరావు, డాక్టర్‌ జామి భీమశంకరరావు, కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు సింతు సుధాకర్‌ పాల్గొన్నారు.

తొగరాం పంచాయతీ సర్పంచి బరిలో సీతారాం సతీమణి పోటీలో నిలిచినందున అక్కడ ప్రజలను భయపెట్టి గెలవాలని చూస్తున్నారని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. మందస మండలం బహాడపల్లిలో పక్కనున్న గ్రామాల నుంచి ప్రజలను తీసుకెళ్లి ఓట్లు వేయించారన్నారు. తక్షణమే అక్కడ ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న చోట్ల ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. నగర తెదేపా అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, రాష్ట్ర హస్తకళల సంస్థ మాజీ డైరెక్టర్‌ ఇప్పిలి తిరుమలరావు, డాక్టర్‌ జామి భీమశంకరరావు, కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు సింతు సుధాకర్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తొలుత 12 పట్టణాల్లో మధ్య తరగతికి తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలు : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.