ETV Bharat / state

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన తమ్మినేని సీతారాం - శ్రీకాకుళం జిల్లాలో రక్తదాన శిబిరం వార్తలు

పరివర్తన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమదాలవలసలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. జిల్లాలోని ప్రతీ ఒక్కరూ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tammineni Sitaram Opening a blood donation camp at Amadalavalasa in Srimadakulam District
Tammineni Sitaram Opening a blood donation camp at Amadalavalasa in Srimadakulam District
author img

By

Published : Jun 5, 2020, 12:57 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మణుడుపేట జంక్షన్ వద్ద పరివర్తన్ ట్రస్ట్ అధ్యక్షులు చింతా రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. జిల్లాలోని ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు.

తన జీవితంలో 28 సార్లు రక్తదానం చేశానంటూ తమ్మినేని సీతారాం తెలిపారు. ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం అందిస్తున్న పరివర్తన్ ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్​ను అభినందించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మణుడుపేట జంక్షన్ వద్ద పరివర్తన్ ట్రస్ట్ అధ్యక్షులు చింతా రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. జిల్లాలోని ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు.

తన జీవితంలో 28 సార్లు రక్తదానం చేశానంటూ తమ్మినేని సీతారాం తెలిపారు. ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం అందిస్తున్న పరివర్తన్ ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్​ను అభినందించారు.

ఇదీ చదవండి: హైకోర్టులో వైద్యుడు సుధాకర్‌ తల్లి హెబియస్ కార్పస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.