ETV Bharat / state

'పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే.. దేశం సౌభాగ్యంగా ఉంటుది'

author img

By

Published : Mar 4, 2021, 7:44 AM IST

బాలలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం సౌభాగ్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్​ నివాస్​ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఈ నెల 9 తేదీ వరకు డీవార్మింగ్ మాత్రలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.

srikakulam collector nivas
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ నివాస్​

బాలలు ఆరోగ్యంగా ఉంటేనే.. దేశం సౌభాగ్యంగా ఉంటుందని శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ అభిప్రాయపడ్డారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డీ వార్మింగ్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు కలెక్టర్‌ మాత్రలు వేశారు.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు 4 లక్షల 42 వేల 328 మంది ఉన్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష 52 వేల 486 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. బడికి వెళ్లని పిల్లలు 3 వేల 2 వందల 51 మందితో కలిసి 5 లక్షల 98 వేల 65 మంది పిల్లలు ఉన్నారని వివరించారు. వీరందరికీ ఈ నెల 9 తేదీ వరకు డీవార్మింగ్ మాత్రలను వేయించనున్నట్టు తెలిపారు.

బాలలు ఆరోగ్యంగా ఉంటేనే.. దేశం సౌభాగ్యంగా ఉంటుందని శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ అభిప్రాయపడ్డారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డీ వార్మింగ్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు కలెక్టర్‌ మాత్రలు వేశారు.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు 4 లక్షల 42 వేల 328 మంది ఉన్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష 52 వేల 486 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. బడికి వెళ్లని పిల్లలు 3 వేల 2 వందల 51 మందితో కలిసి 5 లక్షల 98 వేల 65 మంది పిల్లలు ఉన్నారని వివరించారు. వీరందరికీ ఈ నెల 9 తేదీ వరకు డీవార్మింగ్ మాత్రలను వేయించనున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి:

నాడు - నేడు పనులు తనిఖీ చేసిన కలెక్టర్​ నివాస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.