ETV Bharat / state

కన్న తల్లిని వద్దనుకున్నారు.. కనికరం లేకుండా రోడ్డుపై వదిలేశారు! - ఒడిశాలో తల్లిని వదిలేసిన కుమారులు న్యూస్

తొమ్మిది నెలలు బిడ్డలను కడుపులో మోసింది. పిల్లలు వారి కాళ్లపై నిలుచునే వరకూ.. భూజంపై చేయి వేసి ధైర్యం చెప్పింది. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి ఆ తల్లే... పిల్లలకు భారమైంది. మలి వయసులో తోడుగా ఉండాల్సిన కన్నబిడ్డలే తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తున్న ఘటనలు సాధారణం అయిపోయాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్​లో ఇలాంటి ఘటన జరిగింది. ఇప్పుడు ఒడిశాలోనూ కనిపించింది. తల్లికి ఆసరగా ఉండాల్సిన కొడుకులు.. ఎలాంటి దయ లేకుండా రోడ్డుపైనే వదిలేసిపోయారు.

తల్లిని రహదారి పక్కన వదిలేసిన కుమారులు
తల్లిని రహదారి పక్కన వదిలేసిన కుమారులు
author img

By

Published : Jun 12, 2021, 2:33 PM IST

ఆమె కన్నీటితో కడుపు నింపుకొని వారి ఆకలి తీర్చింది..

తాను నిద్రపోకుండా వారికి లాలి పాడి నిద్రపుచ్చింది..

తనకు నడిచే ఓపిక లేకున్నా వారికి నడక నేర్పింది.

ప్రయోజకులను చేసింది.. మురిసిపోయింది..

ఆమె వారికిప్పుడు భారమైపోయింది.. అంతే.. రోడ్డు పక్కన ఏదో ఒక చెత్తను పడేసినట్లు, పనికిరాని కాగితాన్ని బయటకు విసిరేసినట్లు వదిలేసి వెళ్లిపోయారు..

దీర్ఘకాల లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు తల్లిని పోషించలేక రహదారి పక్కన వదిలేసిన సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లా భంజనగర్‌లో గురువారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు తక్షణం స్పందించి, వృద్ధురాలిని కాపాడి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కుమారుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

గంజాం జిల్లా జగన్నాథప్రసాద్‌ పట్టణానికి చెందిన వృద్ధురాలు(65) ఇద్దరు కుమారులతో కలిసి ఉంటోంది. వారికి సొంత ఇల్లు లేదు. కుమారులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. లాక్‌డౌన్‌తో పనులు లభించక, తినేందుకు తిండిలేక వారు తల్లిని గురువారం భంజనగర్‌ శివారున లొహరఖండి ప్రాంతంలో రహదారి పక్కన వదిలేశారు. అక్కడే ఆమె దుస్తులు, ఇతర సామగ్రి ఉన్న సంచుల్ని పడేశారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరు కుమారుల్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి:

ఏనుగుకు 'వివాహ భోజనంబు'- వీడియో వైరల్​

ఆమె కన్నీటితో కడుపు నింపుకొని వారి ఆకలి తీర్చింది..

తాను నిద్రపోకుండా వారికి లాలి పాడి నిద్రపుచ్చింది..

తనకు నడిచే ఓపిక లేకున్నా వారికి నడక నేర్పింది.

ప్రయోజకులను చేసింది.. మురిసిపోయింది..

ఆమె వారికిప్పుడు భారమైపోయింది.. అంతే.. రోడ్డు పక్కన ఏదో ఒక చెత్తను పడేసినట్లు, పనికిరాని కాగితాన్ని బయటకు విసిరేసినట్లు వదిలేసి వెళ్లిపోయారు..

దీర్ఘకాల లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు తల్లిని పోషించలేక రహదారి పక్కన వదిలేసిన సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లా భంజనగర్‌లో గురువారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు తక్షణం స్పందించి, వృద్ధురాలిని కాపాడి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కుమారుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

గంజాం జిల్లా జగన్నాథప్రసాద్‌ పట్టణానికి చెందిన వృద్ధురాలు(65) ఇద్దరు కుమారులతో కలిసి ఉంటోంది. వారికి సొంత ఇల్లు లేదు. కుమారులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. లాక్‌డౌన్‌తో పనులు లభించక, తినేందుకు తిండిలేక వారు తల్లిని గురువారం భంజనగర్‌ శివారున లొహరఖండి ప్రాంతంలో రహదారి పక్కన వదిలేశారు. అక్కడే ఆమె దుస్తులు, ఇతర సామగ్రి ఉన్న సంచుల్ని పడేశారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరు కుమారుల్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి:

ఏనుగుకు 'వివాహ భోజనంబు'- వీడియో వైరల్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.