శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఏడో తరగతి విద్యార్థిని భువనేశ్వరిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న పాఠశాల ప్రిన్సిపల్.. విద్యార్థిని తల్లిని పిలిపించి మాట్లాడారు. తర్వాత కుమార్తెను తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం తల్లి బయటకు వెళ్లగా భువనేశ్వరి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి బహిర్భూమికని వెళ్లింది. కొంతసేపటి తర్వాత తుప్పల్లో ఆమె కేకలు విని స్థానికులు వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె కాలిన గాయాలతో ఉంది. మెరుగైన చికిత్స కోసం బాధితురాలని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలికను ప్రశ్నించగా.. ఇద్దరు బాలురు తనపై పెట్రోలు పోసినట్లు చెప్పింది. పాఠశాలలో జరిగిన పరిణామాలు.. బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి