ETV Bharat / state

గుంటూరులో మహిళ దారుణ హత్య - lady murder in yamarru

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం యామర్రులో దారుణం జరిగింది. ఓ మహిళను దుండగులు మారణాయుధాలతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్​టీం, పోలీసు జాగిలాలతో ఆధారాల కోసం శోధించారు.

lady brutally murdered in yamarru
యామర్రులో మహిళ దారుణ హత్య
author img

By

Published : Jan 28, 2020, 11:49 AM IST

మహిళ దారుణంగా హతమార్చిన దుండగులు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రుల్లో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి చెరువు హెడ్ ట్యాంక్ వద్ద కేకలు వినిపించటంతో అక్కడకు పరుగులు తీసినట్లు స్థానికులు వివరించారు. అప్పటికే మహిళ రక్తపు మడుగులో పడి ఉందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను మారణాయుధాలతో దారుణంగా దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు యనమదల రాధగా గుర్తించారు. రాధ భర్త 8 సంవత్సరాల క్రితమే మరణించారనీ, అప్పటి నుంచీ ఆమె ఒంటరిగానే ఉంటున్నట్లు పోలీసులు వివరించారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

వజ్రాల దొంగలు అరెస్టు... రూ.7 లక్షల సొత్తు స్వాధీనం

మహిళ దారుణంగా హతమార్చిన దుండగులు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రుల్లో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి చెరువు హెడ్ ట్యాంక్ వద్ద కేకలు వినిపించటంతో అక్కడకు పరుగులు తీసినట్లు స్థానికులు వివరించారు. అప్పటికే మహిళ రక్తపు మడుగులో పడి ఉందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను మారణాయుధాలతో దారుణంగా దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు యనమదల రాధగా గుర్తించారు. రాధ భర్త 8 సంవత్సరాల క్రితమే మరణించారనీ, అప్పటి నుంచీ ఆమె ఒంటరిగానే ఉంటున్నట్లు పోలీసులు వివరించారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

వజ్రాల దొంగలు అరెస్టు... రూ.7 లక్షల సొత్తు స్వాధీనం

Intro:Ap_gnt_61_28_mahila_hathya_av_AP10034

Contributor : k. Vara prasad ( prathipadu),guntur


Anchor : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రులో అర్ధరాత్రి సమయంలో యనమదల రాధ (48) దారుణ హత్యకు గురైంది. చెరువు హెడ్ ట్యాంక్ వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు పరుగులు తీశారని అప్పటికే రాధ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు స్థానికులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మారణాయుధాలతో ఆమెను నరికి చంపినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రాధ భర్త ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. పోలీసులు శునకాల తెప్పించి నింధితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
Body:EndConclusion:End
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.