ETV Bharat / state

వ్యవసాయ బావిలో కొండచిలువ.. పట్టుకున్న అధికారులు - వ్యవసాయ బావిలో పాము

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్టలో వ్యవసాయ బావిలో కొండచిలువను గుర్తించారు. ఈ విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ జంతు సంరక్షణ గస్తీ విభాగానికి, అటవీ శాఖకి తెలియజేశారు. అధికారులు ఆ పాముని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

kondachiluva in well at srikakulam district
kondachiluva in well at srikakulam district
author img

By

Published : Sep 5, 2020, 11:06 AM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట సమీప వ్యవసాయ బావిలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. కొండచిలువను గ్రామస్థులు గుర్తించి... ఈ విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ జంతు సంరక్షణ గస్తీ విభాగానికి, అటవీ శాఖకి తెలియజేశారు. గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం, అటవీశాఖ సిబ్బందితో కలసి అక్కడకు చేరుకున్నారు. గ్రీన్ మెర్సీ సంస్థ ప్రతినిధి రమణమూర్తి చాకచక్యంగా ఆ పాముని బావి నుంచి బయటకు తీశారు.

అనంతరం గ్రామస్థులకు పాములపై రమణమూర్తి అవగాహన కల్పించారు. పాములను కాపాడవలసిన ఆవశ్యకత వివరించారు. అనంతరం ఆ పాముని జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. డీఎఫ్ఓ సందీప్ కృపాకర్ సూచన మేరకు ఆ పాముని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట సమీప వ్యవసాయ బావిలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. కొండచిలువను గ్రామస్థులు గుర్తించి... ఈ విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ జంతు సంరక్షణ గస్తీ విభాగానికి, అటవీ శాఖకి తెలియజేశారు. గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం, అటవీశాఖ సిబ్బందితో కలసి అక్కడకు చేరుకున్నారు. గ్రీన్ మెర్సీ సంస్థ ప్రతినిధి రమణమూర్తి చాకచక్యంగా ఆ పాముని బావి నుంచి బయటకు తీశారు.

అనంతరం గ్రామస్థులకు పాములపై రమణమూర్తి అవగాహన కల్పించారు. పాములను కాపాడవలసిన ఆవశ్యకత వివరించారు. అనంతరం ఆ పాముని జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. డీఎఫ్ఓ సందీప్ కృపాకర్ సూచన మేరకు ఆ పాముని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

ఇదీ చదవండి: చికిత్సకు వెళ్లడంలో జాప్యంతోనే కొవిడ్ మరణాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.