శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ధాన్యం, గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన 8 మంది రైతుల ధాన్యం బస్తాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియలేదు. అయితే ఒకే కళ్లంలో యంత్రాలతో నూర్పిడి చేసి బస్తాలతో భద్రపరిచిన ధాన్యానికి అగ్ని కీలలు వ్యాపించాయి. గాలుల తీవ్రత కారణంగా అగ్ని మంటలు క్షణాల్లో వ్యాప్తి చెందాయని స్థానికులు తెలిపారు. ధాన్యం కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం వల్ల కళ్లంలోనే దాచుకున్నామని బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: