శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీ చేశారు. కరోనా కారణంగా సెలవుదినాల్లో విద్యార్థులకు ఆహారం అందించేందుకు ఈ డ్రై రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రతి విద్యార్థికి సెలవుదినాలకు గాను 56 గుడ్లతో పాటు బియ్యం, శనగ ఉండలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు వరుస కట్టారు.
![dry ration distribution in srikakulam dst narsannapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-sklm-62-31-dry-ration-schools-av-ap10143_31082020132224_3108f_00848_176.jpg)
ఇదీ చూడండి