ETV Bharat / state

పాతపట్నంలో కూరగాయల పంపిణీ వేగవంతం

author img

By

Published : Apr 28, 2020, 12:11 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని రెడ్ జోన్ గ్రామాల్లో కూరగాయల పంపిణీని అధికారులు వేగవంతం చేశారు. సుమారు 20 టన్నుల కూరగాయలు సిద్ధం చేశారు.

srikakulam district
పాతపట్నంలో వేగవంతం చేసిన కూరగాయలు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో 18 గ్రామాలను రెడ్ జోన్ గా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ... కూరగాయల పంపిణీ వేగవంతం చేశారు.

ముందుజాగ్రత్తగా ప్రజలు అధిక సంఖ్యలో కొనుగోలు చేయటం వల్ల కొన్ని గ్రామాల ప్రజలకు 2 రోజులుగా కూరగాయల అందలేదు. అందుకే మంగళవారం ఒక్క రోజే సుమారు 20 టన్నుల కూరగాయలు పంపిణీకి సిద్ధం చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలకు కూరగాయలు అందుతాయని అధికారులు భరోసా ఇస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో 18 గ్రామాలను రెడ్ జోన్ గా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ... కూరగాయల పంపిణీ వేగవంతం చేశారు.

ముందుజాగ్రత్తగా ప్రజలు అధిక సంఖ్యలో కొనుగోలు చేయటం వల్ల కొన్ని గ్రామాల ప్రజలకు 2 రోజులుగా కూరగాయల అందలేదు. అందుకే మంగళవారం ఒక్క రోజే సుమారు 20 టన్నుల కూరగాయలు పంపిణీకి సిద్ధం చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలకు కూరగాయలు అందుతాయని అధికారులు భరోసా ఇస్తున్నారు.

ఇదీ చదవండి:

ఒకే పడవలో 4 రోజులు ప్రయాణం... చివరికి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.