ETV Bharat / state

11 కంటైన్మెంట్ గ్రామాల్లో సడలింపులు

author img

By

Published : May 18, 2020, 12:23 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలోని 11 కంటైన్మెంట్ గ్రామాల్లో.. అధికారులు సడలింపులు అమలు చేశారు. గత నెల 24న మండలంలో కరోనా కేసు నమోదైనందున 18 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఇన్ని రోజులుగా కరోనా కేసులు నమోదు కానందున ఆంక్షలను సడలించారు.

contaiment villages reduced in pathapatnam
పాతపట్నంలో 11 కంటైన్మెంట్ గ్రామాలకు సడలింపు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కంటైన్మెంట్ గ్రామాలను తగ్గిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నుంచి 11 గ్రామాల్లో ఆంక్షలు సడలిస్తున్నట్టు తెలిపారు. పాతపట్నం మండలంలో గత నెల 24వ తేదీన కరోనా పాజిటివ్ నమోదైన నేపథ్యంలో 18 గ్రామాలను కంటైన్మెంట్ గ్రామాలుగా గుర్తించారు.

అనంతరం ఆదివారం 11 గ్రామాలకు అధికారులు సడలింపు చేశారు. దీంతో పాతపట్నంతో పాటు మరికొన్ని గ్రామాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. మిగతా ఏడు గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్ కొనసాగుతోందని.. ఆంక్షల యథావిధిగా అమలవుతాయని తహసీల్దార్ కాళీ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి:

పోలవరం పరవళ్లకు కరోనా అడ్డు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కంటైన్మెంట్ గ్రామాలను తగ్గిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నుంచి 11 గ్రామాల్లో ఆంక్షలు సడలిస్తున్నట్టు తెలిపారు. పాతపట్నం మండలంలో గత నెల 24వ తేదీన కరోనా పాజిటివ్ నమోదైన నేపథ్యంలో 18 గ్రామాలను కంటైన్మెంట్ గ్రామాలుగా గుర్తించారు.

అనంతరం ఆదివారం 11 గ్రామాలకు అధికారులు సడలింపు చేశారు. దీంతో పాతపట్నంతో పాటు మరికొన్ని గ్రామాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. మిగతా ఏడు గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్ కొనసాగుతోందని.. ఆంక్షల యథావిధిగా అమలవుతాయని తహసీల్దార్ కాళీ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి:

పోలవరం పరవళ్లకు కరోనా అడ్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.