ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ నివాస్ - శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్

శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేంద్రాల్లో 5వేల బెడ్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా పాలనాధికారి నివాస్ తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర, వైష్ణవి కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్​లను ఆయన పరిశీలించారు.

collector visits covid hospitals
కొవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ నివాస్
author img

By

Published : Jul 27, 2020, 8:29 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేంద్రాల్లో 5వేల బెడ్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా పాలనాధికారి నివాస్ తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర, వైష్ణవి కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్​లను ఆయన పరిశీలించారు. బెడ్లతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వ్యర్ధాలను కొవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా డిస్పోజ్ చేయాలన్నారు.

జిల్లాలో మొత్తం 4 వేల 4 వందల 17 కేసులు ఉండగా.. అందులో 2 వేల 57ఆక్టివ్ కేసులు ఉన్నాయని అందులో 898 మంది ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిను కొవిడ్ ఆసుపత్రిగా మార్చామన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేంద్రాల్లో 5వేల బెడ్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా పాలనాధికారి నివాస్ తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర, వైష్ణవి కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్​లను ఆయన పరిశీలించారు. బెడ్లతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వ్యర్ధాలను కొవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా డిస్పోజ్ చేయాలన్నారు.

జిల్లాలో మొత్తం 4 వేల 4 వందల 17 కేసులు ఉండగా.. అందులో 2 వేల 57ఆక్టివ్ కేసులు ఉన్నాయని అందులో 898 మంది ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిను కొవిడ్ ఆసుపత్రిగా మార్చామన్నారు.

ఇదీ చదవండి:

టెక్కలిలో కొవిడ్​ కేర్​ సెంటర్​ను పరిశీలించిన జేసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.