ETV Bharat / state

ట్రావెల్స్​ బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు

author img

By

Published : Apr 11, 2021, 4:11 PM IST

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దినాయుడుపేట సమీపంలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమది మందికి స్వల్ప గాయాలయ్యాయి.

bus overturned
బస్సు బోల్తా

శ్రీకాకుళం జిల్లా పెద్దినాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. టెక్కలి నుంచి పలాస వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను టెక్కలి, పలాస ప్రైవేటు ఆస్పత్రులకు తరలించినట్టు నందిగాం ఏఎస్సై మురళీకృష్ణ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

శ్రీకాకుళం జిల్లా పెద్దినాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. టెక్కలి నుంచి పలాస వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను టెక్కలి, పలాస ప్రైవేటు ఆస్పత్రులకు తరలించినట్టు నందిగాం ఏఎస్సై మురళీకృష్ణ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

ఇదీ చదవండీ.. దువ్వాడ సెజ్‌లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.