ETV Bharat / state

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జీఎంఆర్​కు అప్పగింత - Bogapuram Airport

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, నిర్వాహణలను జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా ఒక్కో ప్రయాణికుడి ఫీజు కింద రూ.303 చొప్పున ప్రభుత్వానికి చెల్లించేందుకు ముందుకు రావటంతో జీఎంఆర్ సంస్థను హెచ్​-1 బిడ్డర్​గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జీఎంఆర్​కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జీఎంఆర్​కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ
author img

By

Published : Mar 31, 2020, 6:52 AM IST

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, నిర్వహణలను జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్​ఫర్ డీబీఎఫ్ఓటీ ప్రాతిపదికన పీపీపీ ప్రాజెక్టుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు జీఎంఆర్ సంస్థను నిర్ధరిస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా ఒక్కో ప్రయాణికుడి ఫీజు కింద రూ.303 చొప్పున ప్రభుత్వానికి చెల్లించేందుకు ముందుకు రావటంతో జీఎంఆర్ సంస్థను హెచ్ 1 బిడ్డరుగా ప్రకటించింది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు గానూ 2203.26 ఎకరాలను జీఎంఆర్​ సంస్థకు అప్పగించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సమీకృత గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్​తో పాటు ఏవియేషన్ శిక్షణా సంస్థ, విమానాల నిర్వహణ, రిపేర్లు ఓవర్ హాలీంగ్(ఎంఆర్ఓ) కేంద్రాలను జీఎంఆర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు మిగిలిన 362 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ ఎయిర్ పోర్ట్సు డెవలప్మెంట్ కార్పోరేషన్​కు రూ.280 కోట్ల మేర రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, నిర్వహణలను జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్​ఫర్ డీబీఎఫ్ఓటీ ప్రాతిపదికన పీపీపీ ప్రాజెక్టుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు జీఎంఆర్ సంస్థను నిర్ధరిస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా ఒక్కో ప్రయాణికుడి ఫీజు కింద రూ.303 చొప్పున ప్రభుత్వానికి చెల్లించేందుకు ముందుకు రావటంతో జీఎంఆర్ సంస్థను హెచ్ 1 బిడ్డరుగా ప్రకటించింది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు గానూ 2203.26 ఎకరాలను జీఎంఆర్​ సంస్థకు అప్పగించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సమీకృత గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్​తో పాటు ఏవియేషన్ శిక్షణా సంస్థ, విమానాల నిర్వహణ, రిపేర్లు ఓవర్ హాలీంగ్(ఎంఆర్ఓ) కేంద్రాలను జీఎంఆర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు మిగిలిన 362 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ ఎయిర్ పోర్ట్సు డెవలప్మెంట్ కార్పోరేషన్​కు రూ.280 కోట్ల మేర రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: లాక్​డౌన్​తో రంగంలోకి నౌకాదళ విమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.