ETV Bharat / state

గుజరాత్​లో అనారోగ్యంతో సిక్కోలు మత్స్యకారుడు మృతి - srikakulma fisher man died in gujarath news

పొట్టకూటి కోసం వేరే రాష్ట్రానికి వెళ్లాడు. కరోనా ప్రభావంతో లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయాడు. సరైన వసతి, ఆహారం లేక కడుపునొప్పితో అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చే వీలు లేక చివరకు అధికారులు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. తమను రక్షించడానికి వెళ్లిన భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసిన మృతుని భర్త, బిడ్డలు గుండెలవిసేలా విలపించారు.

గుజరాత్​లో అనారోగ్యంతో సిక్కోలు మత్స్యకారుడు మృతి
గుజరాత్​లో అనారోగ్యంతో సిక్కోలు మత్స్యకారుడు మృతి
author img

By

Published : Apr 9, 2020, 3:36 PM IST

గుజరాత్​లోని వీరవల్​లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడు అనారోగ్యం బారిన పడి బుధవారం మృతి చెందాడు. గార మండలం కె.మత్స్యలేశం గ్రామం కళింగపట్నం శివారులోని చిన్నపల్లిపేటకు చెందిన ఎన్నేటి జగన్నాథం చేపలవేట, కూలీ పనుల కోసం ఎనిమిది నెలల క్రితం వీరవల్​ వెళ్లాడు. ప్రస్తుత లాక్​డౌన్​ కారణంగా సొంత గ్రామానికి చేరలేని దుర్భర పరిస్థితిల్లో జగన్నాథంతో పాటు మరికొందరు అక్కడే ఉన్నారు. వారికి వసతి సౌకర్యాలు కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్.. మూడ్రోజుల కిందట శ్రీకాకుళం నుంచి ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించారు. వీరు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్న సమయంలోనే జగన్నాథం కడుపునొప్పితో అనారోగ్యం పాలయ్యాడు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి జగన్నాథం మృతి చెందాడు.

అక్కడే అంత్యక్రియలు..
మృతదేహానికి పరీక్ష నిర్వహించిన అనంతరం అక్కడే దహన సంస్కారాలు చేసినట్లు శ్రీకాకుళం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం సభ్యులు తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా చివరి చూపునకూ నోచుకోలేకపోయామని మృతుని భార్య, బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వారందరినీ బోట్ల నుంచి వేరే క్వారంటైన్ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన వసతి కోసం వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు.

గుజరాత్​లోని వీరవల్​లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడు అనారోగ్యం బారిన పడి బుధవారం మృతి చెందాడు. గార మండలం కె.మత్స్యలేశం గ్రామం కళింగపట్నం శివారులోని చిన్నపల్లిపేటకు చెందిన ఎన్నేటి జగన్నాథం చేపలవేట, కూలీ పనుల కోసం ఎనిమిది నెలల క్రితం వీరవల్​ వెళ్లాడు. ప్రస్తుత లాక్​డౌన్​ కారణంగా సొంత గ్రామానికి చేరలేని దుర్భర పరిస్థితిల్లో జగన్నాథంతో పాటు మరికొందరు అక్కడే ఉన్నారు. వారికి వసతి సౌకర్యాలు కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్.. మూడ్రోజుల కిందట శ్రీకాకుళం నుంచి ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించారు. వీరు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్న సమయంలోనే జగన్నాథం కడుపునొప్పితో అనారోగ్యం పాలయ్యాడు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి జగన్నాథం మృతి చెందాడు.

అక్కడే అంత్యక్రియలు..
మృతదేహానికి పరీక్ష నిర్వహించిన అనంతరం అక్కడే దహన సంస్కారాలు చేసినట్లు శ్రీకాకుళం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం సభ్యులు తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా చివరి చూపునకూ నోచుకోలేకపోయామని మృతుని భార్య, బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వారందరినీ బోట్ల నుంచి వేరే క్వారంటైన్ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన వసతి కోసం వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

పాలకొండలో ఈదురుగాలులతో విద్యుత్​ సరఫరాకు అంతరాయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.