శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో సరైన పత్రాలు లేకుండా ఒడిశాకు వెళ్తున్న మూడు లారీలను అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, మార్కెటింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వీటి విలువ 80 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్న ఉల్లిపాయలపై అధికారులు నిఘా పెట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం లోద్దపుట్టి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. కర్నూల్ నుంచి ఒడిశాకు వెళ్తున్న రెండు లారీలను... మహారాష్ట్ర నుంచి ఒడిశాకు వెళ్తున్న ఒక లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
ఇదీ చదవండి :