ETV Bharat / state

వైద్య పరికరాలకే.. జబ్బొస్తే..!

అబ్బాయి పుడితే 2000, ఆడపిల్ల పుడితే 1000. ఏంటని అనుకుంటున్నారా? ఇది ప్రకాశం జిల్లా చీరాలలో ఉన్న గోపాలకృష్ణయ్య ఏరియా ఆసుపత్రిలోని ప్రసూతి వైద్యులకు చెల్లించుకోవాల్సిన ముడుపులు.

author img

By

Published : Jul 13, 2019, 8:08 PM IST

వైద్య పరికరాలకు జబ్బొచ్చింది
వైద్య పరికరాలకు జబ్బొచ్చింది

ప్రకాశం జిల్లా చీరాల ఏరియా ఆసుపత్రిలో ఉన్న సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆసుపత్రిలోని ఎక్స్​రే, ఈసీజీకి సంబంధించిన పరికరాలు పనిచేయవు. ఇక్కడ మత్తు డాక్టర్ ఉన్నా.... ఆపరేషన్ సమయంలో ఇంజెక్షన్ బయట కొనుక్కోవాల్సిందే. ఇంతే కాదు.. ఈ ఆసుపత్రిలో అబ్బాయి పుడితే 2 వేలు.. అమ్మాయి పుడితే వెయ్యి ఇనామ్ ఇచ్చుకోవాల్సిందే. ఇలాంటి సమస్యలపై సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాబు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నూతనంగా నిర్మించిన భవనంలో అన్ని వసతులు, పరికరాలు ఏర్పాటు చేసినా ఆసుపత్రి సూపరింటెండెంట్ తిరుపాల్ నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. ఆయన కారణంగా వైద్య పరికరాలు పనిచేయకుండా పోయాయని ఆగ్రహించారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఒంగోలులో 'హైటెన్షన్'... భయంతో వణికిపోతున్న ప్రజలు

వైద్య పరికరాలకు జబ్బొచ్చింది

ప్రకాశం జిల్లా చీరాల ఏరియా ఆసుపత్రిలో ఉన్న సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆసుపత్రిలోని ఎక్స్​రే, ఈసీజీకి సంబంధించిన పరికరాలు పనిచేయవు. ఇక్కడ మత్తు డాక్టర్ ఉన్నా.... ఆపరేషన్ సమయంలో ఇంజెక్షన్ బయట కొనుక్కోవాల్సిందే. ఇంతే కాదు.. ఈ ఆసుపత్రిలో అబ్బాయి పుడితే 2 వేలు.. అమ్మాయి పుడితే వెయ్యి ఇనామ్ ఇచ్చుకోవాల్సిందే. ఇలాంటి సమస్యలపై సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాబు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నూతనంగా నిర్మించిన భవనంలో అన్ని వసతులు, పరికరాలు ఏర్పాటు చేసినా ఆసుపత్రి సూపరింటెండెంట్ తిరుపాల్ నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. ఆయన కారణంగా వైద్య పరికరాలు పనిచేయకుండా పోయాయని ఆగ్రహించారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఒంగోలులో 'హైటెన్షన్'... భయంతో వణికిపోతున్న ప్రజలు

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు.
రిపోర్టర్ కే శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం anBody:అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని గజ్జి రెడ్డి పల్లి లో తాగునీటి సమస్య కోసం మహిళలు రోడ్డెక్కారు. మూడు వారాలుగా తాగునీటిని సరఫరా చేయడం లేదంటూ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. స్థానికుల ఆందోళనతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తాగునీటి సరఫరా చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటూ తేల్చి చెప్పారు. నీటి సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకు ని ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.Conclusion:

For All Latest Updates

TAGGED:

cheerala
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.