ETV Bharat / state

తొలి విడత పంచాయితీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధం

author img

By

Published : Feb 8, 2021, 9:26 PM IST

ప్రకాశం జిల్లాలో తొలి విడత స్థానిక ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. 14 మండలాల్లోని 227 పంచాయితీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Prakasam district is preparing for the first installment of panchayat elections
తొలి విడత పంచాయితీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధం

ప్రకాశం జిల్లా తొలి విడత పంచాయితీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 14 మండలాల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు. 227 పంచాయితీలకు గాను.. 35 పంచాయితీ సర్పంచి పదవులకు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో 2365 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగనున్న తొలివిడత ఎన్నికలకు 7754 మంది సిబ్బందిని నియమించారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల వద్దకు సిబ్బంది చేరుకున్నారు.

వీరికి మాస్కులు, శానిటైజర్లను సిద్ధం చేశారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, ప్రత్యేక దళాలు, రిజర్వు పోలీసులు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ప్రకాశం జిల్లా తొలి విడత పంచాయితీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 14 మండలాల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు. 227 పంచాయితీలకు గాను.. 35 పంచాయితీ సర్పంచి పదవులకు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో 2365 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగనున్న తొలివిడత ఎన్నికలకు 7754 మంది సిబ్బందిని నియమించారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల వద్దకు సిబ్బంది చేరుకున్నారు.

వీరికి మాస్కులు, శానిటైజర్లను సిద్ధం చేశారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, ప్రత్యేక దళాలు, రిజర్వు పోలీసులు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

పోలింగ్​కు సర్వం సిద్ధం... సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.