ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలో ఎన్టీఆర్నగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు మహిళలకు తీవ్రగాయాలవ్వడంతో ఒంగోలు రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ అంజమ్మ అనే వృద్ధురాలు మృతిచెందింది. గాయపడిన మరో మహిళ చికిత్స పొందుతోంది. ఘటనపై అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ ఎద్దులేం పాపం చేశాయి?