ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, నినాదాలు చేశారు. తమను సచివాలయాలకు కేటాయించడం తగదని నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకులు, సీహెచ్ గంగయ్య, పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:భారత్-చైనా రాజీ బాట... బలగాల ఉపసంహరణకు సై!