ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో 1,856 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్లతో పాటు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, కలెక్టర్ పోల భాస్కర్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేని విధంగా.. అతికొద్ది సమయంలోనే వైకాపా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని బొత్స పేర్కొన్నారు. ఈ పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు కేసులు పెడుతున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు తరహా నాయకులు మారాలన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఈనెల 22న ప్రకాశం జిల్లాకు పవన్ కల్యాణ్