ETV Bharat / state

విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

author img

By

Published : May 14, 2020, 8:24 PM IST

Updated : May 14, 2020, 10:06 PM IST

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని‌ ఢీకొట్టింది. విద్యుత్ తీగలు తగిలి తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు.

విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ' పోయిన జీవితాలు
విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ' పోయిన జీవితాలు
విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

9 మంది కూలీల జీవితాలు చీకటైపోయాయి. ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండల రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్​.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందినవారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌, మరో మహిళ తీవ్రగాయాలు కాగా.. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. ఘటనాస్థలిని జాయింట్ కలెక్టర్ మురళి పరిశీలించారు. మృతదేహాలను కాసేపట్లో ఒంగోలు రిమ్స్​కు తరలించనున్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాట్లు కల్పించడంతో ఈ రోజు ఉదయం కొందరు కూలీలు ట్రాక్టర్‌పై మిరప కోత పనులకు వెళ్లారు. గతంలో ఆటోలలో వెళ్లే వీరంతా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాటికి అనుమతి లేకపోవడంతో ట్రాక్టర్‌లో పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం మిరప కోత పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఇంటికి చేరుకొనే లోపే విగతజీవులుగా మారడం అందరినీ కలచివేస్తోంది. మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

చీకటైన బతుకులు

మృతులు:

కోటేశ్వరమ్మ(50), లక్ష్మమ్మ(65), కాకుమాను రమాదేవి(55), కాకుమాను కుమారి(45), కాకుమాను రమశ్రీ(40), కాకుమాను అమూల్య, రవిశంకర్‌(18), కాకుమాను శివ(16), కాకుమాను మౌనిక(14)

విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

9 మంది కూలీల జీవితాలు చీకటైపోయాయి. ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండల రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్​.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందినవారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌, మరో మహిళ తీవ్రగాయాలు కాగా.. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. ఘటనాస్థలిని జాయింట్ కలెక్టర్ మురళి పరిశీలించారు. మృతదేహాలను కాసేపట్లో ఒంగోలు రిమ్స్​కు తరలించనున్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాట్లు కల్పించడంతో ఈ రోజు ఉదయం కొందరు కూలీలు ట్రాక్టర్‌పై మిరప కోత పనులకు వెళ్లారు. గతంలో ఆటోలలో వెళ్లే వీరంతా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాటికి అనుమతి లేకపోవడంతో ట్రాక్టర్‌లో పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం మిరప కోత పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఇంటికి చేరుకొనే లోపే విగతజీవులుగా మారడం అందరినీ కలచివేస్తోంది. మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

చీకటైన బతుకులు

మృతులు:

కోటేశ్వరమ్మ(50), లక్ష్మమ్మ(65), కాకుమాను రమాదేవి(55), కాకుమాను కుమారి(45), కాకుమాను రమశ్రీ(40), కాకుమాను అమూల్య, రవిశంకర్‌(18), కాకుమాను శివ(16), కాకుమాను మౌనిక(14)

Last Updated : May 14, 2020, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.