ETV Bharat / state

వైకల్యంపై విజయం సాధించిన కుమారస్వామి - వికలాంగ చేనేత కార్మికుడి కష్టాలు

చేనేత వస్త్రాలు.. చూడడానికి ఎంత అందంగా ఉంటాయో.. వాటిని నేయడమూ అంతే కష్టంగా ఉంటుంది. మగ్గం మీద చీరలు నేయడం ఎంత కష్టమో నేతన్నలను చూస్తే అర్థమవుతుంది. అదే జీవనోపాధి అయినందువల్ల ఆ కష్టాన్ని ఇష్టంగా భరిస్తారు. చేతులు, కాళ్లు సరిగ్గా ఉన్నవాళ్లకే నేయడం కష్టమనుకుంటే.. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన కుమారస్వామి ఒక కాలు లేకపోయినా చీరలు నేస్తున్నారు. అంతేకాదు వాటిని సరైన విధంగా మార్కెటింగ్ చేసుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

వికలాంగ చేనేత కార్మికుడి కష్టాలు
author img

By

Published : Oct 20, 2019, 12:51 PM IST

వికలాంగ చేనేత కార్మికుడి కష్టాలు

మనసుంటే మార్గముంటుంది అనడానికి ఆ యువకుడే ఉదాహరణ. కాలు లేకపోతేనేం ఆత్మవిశ్వాసంతో.. వచ్చిన పని చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఈపేటకు చెందిన కుమారస్వామి కుటుంబం 17ఏళ్ల కింద ప్రకాశం జిల్లా జాండ్రపేటకు వలసవచ్చారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి కుటుంబ భారం మోస్తున్నాడు. నేత పని నేర్చుకొని మగ్గం పెట్టుకుని ఆర్థిక కష్టాలు అధిగమించాడు. విధి వక్రీకరించి 4 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో కుమారస్వామి కాలు పోగొట్టుకున్నాడు. అప్పుడు మరోసారి జీవనోపాధి ఎలా అనే ప్రశ్న మొదలైంది.

ఈ ప్రమాదంతో పరిస్థితి మొదటికొచ్చింది. కుమారస్వామి మాత్రం ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఒంటికాలితోనే ధైర్యంగా ముందడుగేశాడు. తెలిసిన పనే చేయాలని నిర్ణయించుకున్నాడు. మగ్గానికి మార్పులు చేసి అనుకూలంగా మార్చుకున్నాడు. దానిపైనే చీరలు నేస్తూ.. వాటిని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. తల్లినీ పోషించుకుంటున్నాడు. వికలాంగుల కోటాలో పింఛన్​కు అర్జీ పెట్టుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదనీ.. తనను ఆదుకుంటే మరికొంతమందికి ఉపాధి కల్పిస్తాననీ అంటున్నాడీ కుమారస్వామి.

పేదరికం అలుముకున్నా... ఒక కాలు కోల్పోయినా.. ఆత్మవిశ్వాసంతో వైకల్యంపై విజయం సాధించిన కుమారస్వామి ప్రయాణం ఎందరికో ఆదర్శం.

ఇవీ చదవండి...

ఈ బాడీ బిల్డర్​కు సాయం చేస్తే... సాధిస్తాడో పతకం..!

వికలాంగ చేనేత కార్మికుడి కష్టాలు

మనసుంటే మార్గముంటుంది అనడానికి ఆ యువకుడే ఉదాహరణ. కాలు లేకపోతేనేం ఆత్మవిశ్వాసంతో.. వచ్చిన పని చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఈపేటకు చెందిన కుమారస్వామి కుటుంబం 17ఏళ్ల కింద ప్రకాశం జిల్లా జాండ్రపేటకు వలసవచ్చారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి కుటుంబ భారం మోస్తున్నాడు. నేత పని నేర్చుకొని మగ్గం పెట్టుకుని ఆర్థిక కష్టాలు అధిగమించాడు. విధి వక్రీకరించి 4 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో కుమారస్వామి కాలు పోగొట్టుకున్నాడు. అప్పుడు మరోసారి జీవనోపాధి ఎలా అనే ప్రశ్న మొదలైంది.

ఈ ప్రమాదంతో పరిస్థితి మొదటికొచ్చింది. కుమారస్వామి మాత్రం ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఒంటికాలితోనే ధైర్యంగా ముందడుగేశాడు. తెలిసిన పనే చేయాలని నిర్ణయించుకున్నాడు. మగ్గానికి మార్పులు చేసి అనుకూలంగా మార్చుకున్నాడు. దానిపైనే చీరలు నేస్తూ.. వాటిని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. తల్లినీ పోషించుకుంటున్నాడు. వికలాంగుల కోటాలో పింఛన్​కు అర్జీ పెట్టుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదనీ.. తనను ఆదుకుంటే మరికొంతమందికి ఉపాధి కల్పిస్తాననీ అంటున్నాడీ కుమారస్వామి.

పేదరికం అలుముకున్నా... ఒక కాలు కోల్పోయినా.. ఆత్మవిశ్వాసంతో వైకల్యంపై విజయం సాధించిన కుమారస్వామి ప్రయాణం ఎందరికో ఆదర్శం.

ఇవీ చదవండి...

ఈ బాడీ బిల్డర్​కు సాయం చేస్తే... సాధిస్తాడో పతకం..!

Intro:Body:

గాంధీజీ వాడిన వస్తువు...  వేటపాలెం గ్రంథాలయంలో 

summary...



స్వాతంత్ర్యపోరాటంలో దేశమంతా పర్యటిస్తూ.. మహాత్ముడు అనేక  ప్రాంతాలకు వచ్చారు. ఆంధ్రరాష్ట్రంలో ఉధృతంగా జరిగిన చీరాల- పేరాల ఉద్యమాన్ని  ప్రోత్సహించేందుకు ఆయన వచ్చారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పురాతన గ్రంథాలయం వేటపాలెం సారస్వతినికేతనానికి  మహాత్మడే శంకుస్థాపన చేశారు. గాంధీజీ బాగా ఉపయోగించిన వస్తువు ఆ లైబ్రరీలో ఇప్పటికీ భద్రంగా ఉంది. 



మహాత్ముడి పిలుపునందుకుని.. యావత్ దేశమే.. స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొంది. అందులో తెలుగునేలదీ ప్రత్యేక స్థానం. గాంధీ స్వాతంత్ర్రోద్యమ స్ఫూర్తితో ఇక్కడ అనేక చోట్ల ఉద్యమాలు జరిగాయి.  అందులో ప్రముఖంగా చెప్పుకోవలసింది..చీరాల పేరాల ఉద్యమం. 

---

ప్రకాశం జిల్లా చీరాల... పోరాటాల పురిటిగడ్డ. స్వాతంత్రోద్యమం ఊపందుకున్న రోజుల్లో బ్రిటిష్ పాలకులు పన్నులు కట్టమని హుకుం జారిచేశారు. రొక్కం కట్టే ప్రసక్తే లేదని... ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల-పేరాల ఉద్యమం ప్రారంభించారు. ఊరు ఖాళీ చేసి... చీరాల సమీపంలో గుడిసెలు వేసుకుని తెల్ల దొరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న గాంధీజీ 1929లో ... చీరాల శివాలయం ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ గాంధీ సమావేశానికి వేలాదిమంది ఉద్యమకారులు హాజరయ్యారు. బాపూజీ సమావేశం నిర్వహించిన ప్రదేశంలో... నల్ల రంగులో ఉండే గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది చీరాల పట్టణంలో నల్లగాంధీ కూడలిగా పేరొందింది. 1929,1935 సంవత్సరాల్లో గాంధీజీ రెండు సార్లు చీరాల ప్రాంతానికి వచ్చారు. 1918లో వేటపాలెంలో వి.వి శ్రేష్టి నిర్మించాలనుకున్న సారస్వతనికేతనం భవనానికి 1929లో మహాత్ముడు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో జాతిపితను చూసేందుకు ప్రజలు అధికసంఖ్యలో  వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి... గాంధీజీ చేతి కర్ర విరిగిపోయింది. బాపూ ఆ కర్రను అక్కడే వదిలివెళ్లారు. జాతిపిత చేతికర్ర ఇప్పటికీ గ్రంథాలయంలో భద్రంగా ఉంది.

బైట్ : 1: శ్రీవల్లి, లైబ్రేరియన్, సారస్వతనికేతనం 

గ్రంథాలయం గురించి గాంధీజీ స్వదస్తూరితో రాసి సంతకం పెట్టారు. ఇక్కడ మహాభారతం, భాగవతం, బాపూజీ జీవిత చరిత్రకు సంబంధించిన  పుస్తకాలున్నాయి. అంతేకాకుండా... 1940 ఏడాది ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలు ఇప్పటివరకూ ఉన్నాయి. అనేక అరుదైన పుస్తకాలున్న వేటపాలెం గ్రంథాలయం అనేకమంది పరిశోధకులకు రిఫరెన్సుగా ఉపయోగపడుతోంది.



thumbnail_ గాంధీజీ స్వదస్తూరి ఇలా ఉంటుంది


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.