ETV Bharat / state

సేంద్రీయ ఎరువులతో పూలు, పండ్ల మొక్కల సాగు

author img

By

Published : Jan 29, 2021, 7:59 PM IST

నగరాలు , పట్టణాల్లో అనేక చోట్ల తక్కువ స్థలంలోనే... ఇళ్లు కట్టేస్తుంటారు. ఎక్కడా పచ్చదనం లేకుండా పెద్ద, పెద్ద అంతస్తులతో నింపేస్తుంటారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో.... తన ఇంటి పెరట్లో మొక్కలు పెంచుతూ.... పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు ఓ గృహిణి. వివిధ రకాల పూల మొక్కలతోపాటు.... సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు, పండ్లు పండించి ఇరుగుపొరుగు వారికి పంచుతూ ఆనందం పొందుతున్నారు.

సేంద్రీయ ఎరువులతో పూలు, పండ్ల మొక్కల సాగు
సేంద్రీయ ఎరువులతో పూలు, పండ్ల మొక్కల సాగు
సేంద్రీయ ఎరువులతో పూలు, పండ్ల మొక్కల సాగు

చుట్టూ పచ్చని మొక్కలతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ ఇల్లు.... ఏ పల్లెటూర్లో ఉందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. ఇరుకైన కాలనీ నివాసాల మధ్య ఉన్న ఇంట్లో విశాలమైన పెరటి తోటలు సాగు చేస్తున్నారు అంజమ్మ. పల్లె వాతావరణంలో పుట్టి పెరిగిన ఆమెకు చిన్నతనం నుంచి మొక్కల పట్ల ఉన్న మక్కువతో పెరటి తోటలపై దృష్టి పెట్టారు. ఏడు సెంట్ల స్థలంలో సేంద్రీయ ఎరువులతో వివిధ రకాల పండ్లు, కూరగాయలు , ఆకుకూరలు, పూల మొక్కలను పెంచుతున్నారు.

భర్త సుబ్బారావు మిలటరీలో పనిచేస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఉన్నా కూడా.... కుండీల్లో వివిధ రకాల పూల మొక్కలు పెంచేవారు. పదవీ విరమణ తర్వాత.... ఒంగోలులో విశాలమైన ఇల్లు నిర్మించుకున్నారు. అందులో ఇంకా పెద్ద అపార్ట్‌మెంట్‌ కట్టుకునేంత స్థలం మిగిలే ఉంది. కానీ ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రశాంత వాతావరణం ముఖ్యమని భావించి ఇంటిని చిన్నిపాటి వనంలా మార్చేశారు.

సొంతంగా మొక్కలు, చెట్లు పెంచి వాటి మధ్య జీవనం సాగిస్తే వచ్చే తృప్తి చాలా బాగుందని... తన భార్య ఇష్టాన్ని తాను ఎప్పుడూ ప్రోత్సహిస్తానని భర్త సుబ్బారావు అంటున్నారు.

ఇవీ చదవండి

చీరాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

సేంద్రీయ ఎరువులతో పూలు, పండ్ల మొక్కల సాగు

చుట్టూ పచ్చని మొక్కలతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ ఇల్లు.... ఏ పల్లెటూర్లో ఉందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. ఇరుకైన కాలనీ నివాసాల మధ్య ఉన్న ఇంట్లో విశాలమైన పెరటి తోటలు సాగు చేస్తున్నారు అంజమ్మ. పల్లె వాతావరణంలో పుట్టి పెరిగిన ఆమెకు చిన్నతనం నుంచి మొక్కల పట్ల ఉన్న మక్కువతో పెరటి తోటలపై దృష్టి పెట్టారు. ఏడు సెంట్ల స్థలంలో సేంద్రీయ ఎరువులతో వివిధ రకాల పండ్లు, కూరగాయలు , ఆకుకూరలు, పూల మొక్కలను పెంచుతున్నారు.

భర్త సుబ్బారావు మిలటరీలో పనిచేస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఉన్నా కూడా.... కుండీల్లో వివిధ రకాల పూల మొక్కలు పెంచేవారు. పదవీ విరమణ తర్వాత.... ఒంగోలులో విశాలమైన ఇల్లు నిర్మించుకున్నారు. అందులో ఇంకా పెద్ద అపార్ట్‌మెంట్‌ కట్టుకునేంత స్థలం మిగిలే ఉంది. కానీ ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రశాంత వాతావరణం ముఖ్యమని భావించి ఇంటిని చిన్నిపాటి వనంలా మార్చేశారు.

సొంతంగా మొక్కలు, చెట్లు పెంచి వాటి మధ్య జీవనం సాగిస్తే వచ్చే తృప్తి చాలా బాగుందని... తన భార్య ఇష్టాన్ని తాను ఎప్పుడూ ప్రోత్సహిస్తానని భర్త సుబ్బారావు అంటున్నారు.

ఇవీ చదవండి

చీరాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.