ETV Bharat / state

వలసకూలీలను సొంత గూటికి చేర్చేలా ప్రభుత్వం చర్యలు - corona effect on labours

కాలినడకన నడిచి వెళ్తున్న కూలీలను వారి స్వస్థలాలకు పంపించేందుకు... రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కార్మికులను గుర్తించి వారిని సరిహద్దు దాటించేందుకు రవాణా సౌకర్యం కల్పించారు.

government takes measures to send migrant workers for their native places
వలసకూలీలను సొంత గూటికి చేర్చేలా ప్రభుత్వం చర్యలు
author img

By

Published : May 18, 2020, 5:50 PM IST

రహదారులపై నడిచి వెళుతున్న వలస కూలీలను సరిహద్దు దాటించేందుకు... రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న కూలీలను అధికారులు అడ్డుకొని వారి వివరాలు సేకరించి, బస్సుల్లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు 30 మంది ఉంటే, వారికి ఒక బస్సును కేటాయించి సరిహద్దు వరకూ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒడిశా, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు వలస కూలీలను గుర్తించి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. బస్సుల్లో తరలిస్తుండడంపై వలస కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు నుంచి పోలీసులను తప్పించుకొని, పొలాల వెంట పడి వచ్చామని ఆవేదన చెందారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తాము.. నడిచి వెళ్లక తప్పడంలేదని తెలిపారు.

రహదారులపై నడిచి వెళుతున్న వలస కూలీలను సరిహద్దు దాటించేందుకు... రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న కూలీలను అధికారులు అడ్డుకొని వారి వివరాలు సేకరించి, బస్సుల్లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు 30 మంది ఉంటే, వారికి ఒక బస్సును కేటాయించి సరిహద్దు వరకూ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒడిశా, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు వలస కూలీలను గుర్తించి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. బస్సుల్లో తరలిస్తుండడంపై వలస కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు నుంచి పోలీసులను తప్పించుకొని, పొలాల వెంట పడి వచ్చామని ఆవేదన చెందారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తాము.. నడిచి వెళ్లక తప్పడంలేదని తెలిపారు.

ఇదీ చదవండి:

సేవకు సలాం.. ప్రకాశం జిల్లాలో సున్నాకు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.