ETV Bharat / state

పొలాన్ని పాడు చేసిన పశువులు...కోపంతో కౌలు రైతు ఏం చేశాడంటే..!

ఆ రైతు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పుచ్చ, దోస పంట వేశాడు. పంట సమృద్ధిగా పండింది. రోజూ పశువులు పంటను మేస్తుండడంతో పలుమార్లు యజమానులకు చెప్పి చూశాడు. వారు పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. వారు స్పందించి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ.. గ్రామ సచివాలయం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టాడు.

author img

By

Published : Feb 26, 2021, 10:23 PM IST

byke
సచివాలయం ఎదుట పెట్రోల్ దహనం

తన సొంత ద్విచక్ర వాహనాన్నే ఓ వ్యక్తి పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం కట్టబడినవారిపాలెం సచివాలయం ఎదుట జరిగింది.

గ్రామానికి చెందిన మాదాసు వెంకటేశ్వర్లు అనే రైతు ఆరు ఎకరాల్లో పంటను వేయగా.. పశువులు పొలాన్ని పాడు చేస్తున్నాయి. పశువుల యజమానులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో దర్శి పోలీసులను ఆశ్రయించాడు. వారు న్యాయం చేస్తామని చెప్పి అతణ్ని గ్రామానికి పంపారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. గ్రామ సచివాలయం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని పెట్రోలు పోసి నిప్పంటించాడు.

తన సొంత ద్విచక్ర వాహనాన్నే ఓ వ్యక్తి పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం కట్టబడినవారిపాలెం సచివాలయం ఎదుట జరిగింది.

గ్రామానికి చెందిన మాదాసు వెంకటేశ్వర్లు అనే రైతు ఆరు ఎకరాల్లో పంటను వేయగా.. పశువులు పొలాన్ని పాడు చేస్తున్నాయి. పశువుల యజమానులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో దర్శి పోలీసులను ఆశ్రయించాడు. వారు న్యాయం చేస్తామని చెప్పి అతణ్ని గ్రామానికి పంపారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. గ్రామ సచివాలయం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని పెట్రోలు పోసి నిప్పంటించాడు.

ఇదీ చదవండి: సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.