ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు మండలాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్ని ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలను అతిక్రమించి షాపులు తెరిచి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న అనుమానంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ సోదాలు నిర్వహించినట్లు మార్కాపురం ఎక్సైజ్ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. పామూరులోని ఓ మద్యం దుకాణంలో లెక్కలు సరిగా లేవని గమనించి 80,000 రూపాయలు చలానా కట్టించామని కనిగిరి ఎక్సైజ్ సీఐ విజయభాస్కర్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 427కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు