పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో.. ప్రకాశం జిల్లా చీరాల మండల గ్రామాల ప్రజలతో డీఎస్పీ శ్రీకాంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సీఐ రోశయ్య, ఈపూరపాలెం ఎస్సై సుబ్బారావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
వాలంటీర్లు వద్దు.. వారిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా పెట్టండి: ఎస్ఈసీ