వైద్యం కోసం ఖర్చు చేసుకొని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్న హస్తం అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 75 మందికి మంజూరైన 38 లక్షల 57 వేల 500 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. యర్రగొండపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలను ఆదుకుంటూ.. ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులకోసం ఖర్చు చేసుకున్న పేద కుటుంబాలను సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: నేడు రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికలు