ETV Bharat / state

ఆగస్టు రెండు నుంచి యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్​డౌన్

author img

By

Published : Jul 30, 2020, 8:26 AM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన పోలీసులు.. పట్టణంలో ఆగస్టు రెండో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్​డౌన్​ అమలు చేయాలని నిర్ణయించారు.

Complete lockdown in Yarragondapalem from August second
ఆగస్టు రెండు నుంచి యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్​డౌన్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో కరోన కేసులు పెరుగుతున్నందున ఆగస్టు రెండు నుంచి నాలుగు రోజులపాటు పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని సీ.ఐ దేవా ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వ్యాపారుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన... కరోనా కట్టడి కోసమే ఈ లాక్​డౌన్ విధిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆగస్టు ఒకటి వరకు నిత్యావసర దుకాణాలకు.. ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. లాక్​డౌన్​లో ఎవరూ దుకాణాలు తెరవరాదని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

ఇదీచదవండి.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో కరోన కేసులు పెరుగుతున్నందున ఆగస్టు రెండు నుంచి నాలుగు రోజులపాటు పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని సీ.ఐ దేవా ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వ్యాపారుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన... కరోనా కట్టడి కోసమే ఈ లాక్​డౌన్ విధిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆగస్టు ఒకటి వరకు నిత్యావసర దుకాణాలకు.. ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. లాక్​డౌన్​లో ఎవరూ దుకాణాలు తెరవరాదని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

ఇదీచదవండి.

ఎంపీ నిధులతో అంబులెెన్స్ కొనుగోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.