ప్రభుత్వ అసైన్డ్ భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని జిల్లా రెవెన్యూ అధికారులకు ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. పైఅధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ గ్లోరియా ఈ ఆరోపణలపై విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం పెద్దఇర్లపాడు, రామగోవిందపురం గ్రామాల్లో ఆరుగురికి సంబంధించిన ప్రభుత్వ అసైన్డ్ భూములను ఇటీవల కాలంలో అర్హులకు కాకుండా.. చట్టవ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులకు రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారని జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో విచారణ నిమిత్తం సంబంధిత దస్త్రాలను పరిశీలించారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా అధికారులకు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
TADEPALLI RAPE CASE: తాడేపల్లి అత్యాచార ఘటన.. ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్ అరెస్ట్
CBI COURT NOTICES: బెయిల్ రద్దు పిటిషన్లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు