ETV Bharat / state

మార్టూరు వద్ద ఘోర ప్రమాదం.. నలుగురు మృతి - మార్టూరు జాతీయరహదారిపై రోడ్డుప్రమాదం నలుగురు మృతి.

ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

car  hit the lorry four persons died
లారీని ఢీ కొన్న కారు
author img

By

Published : Jan 7, 2021, 4:37 AM IST

ప్రకాశం జిల్లాలోని మార్టూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. వారు తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు, హైవే సిబ్బంది ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లాలోని మార్టూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. వారు తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు, హైవే సిబ్బంది ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :కంటైనర్ బోల్తా... డ్రైవర్​కు తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.