ETV Bharat / state

టోల్​ ప్లాజా వద్ద కారులో మంటలు...అదుపు చేసిన సిబ్బంది

ఒంగోలు నుంచి విజయవాడకు వెళ్తున్న కారు... బొల్లాపల్లి టోల్​ ప్లాజా వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమై అదుపు చేశారు. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

author img

By

Published : Aug 31, 2020, 12:31 AM IST

car burned at bollapalli checkpost in praksam district and passengers were safe in prakasam district
బొల్లాపల్లి టోల్​ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదం

ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్​ ప్లాజా వద్ద కారు దగ్ధమైంది. ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు... తన తల్లిని తీసుకుని విజయవాడకు బయలుదేరాడు. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్​ ప్లాజా వద్దకు రాగానే అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న టోల్​ప్లాజా, హైవే పెట్రోలింగ్​, అంబులెన్స్​ సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు, ఆయన తల్లి కారు నుంచి దిగిపోయారు. కారు లోపలి భాగమంతా దగ్ధమైంది. టోల్​ ప్లాజా సిబ్బంది చొరవను స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి :

ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్​ ప్లాజా వద్ద కారు దగ్ధమైంది. ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు... తన తల్లిని తీసుకుని విజయవాడకు బయలుదేరాడు. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్​ ప్లాజా వద్దకు రాగానే అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న టోల్​ప్లాజా, హైవే పెట్రోలింగ్​, అంబులెన్స్​ సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు, ఆయన తల్లి కారు నుంచి దిగిపోయారు. కారు లోపలి భాగమంతా దగ్ధమైంది. టోల్​ ప్లాజా సిబ్బంది చొరవను స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి :

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.