ఇవీ చూడండి
ఆటో బోల్తా 20 మంది కూలీలకు గాయాలు
ప్రకాశం జిల్లా కోలలపూడిలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. 20 మందిని గాయాలపాలు చేసింది. 8 మంది మాత్రమే కూర్చున్న ఆటోలో.. 20 మందిని ఎక్కించాడు. వరి పొట్టు లోడుతో వెళ్తున్న ట్రాక్టరును తప్పించబోయి ఢీ కొట్టాడు.
ఆటో బోల్తా పడి 20 మంది కూలీలకు గాయాలయ్యాయి
ప్రకాశం జిల్లా కోలలపూడి సమీపంలో ప్రమాదం జరిగింది. 20 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో... వరిపొట్టు లోడుతో ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలోఆటో బోల్తా పడింది. నలుగురికితీవ్ర గాయాలు కాగా...16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.క్షతగాత్రులను మార్టూరు ఆసుపత్రికి తరలించారు.8 మంది ప్రయాణించే ఆటోలో 20మందిని ఎక్కించుకోవటం నేరమని తెలిసినా.. పట్టించుకోని డ్రైవరు తీరుతోనేప్రమాదం జరిగిందని బాధితులు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
ఇవీ చూడండి
sample description