ప్రకాశంజిల్లా తాళ్ళూరు మండలం బోద్దికూరపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలలో జాతీయపతాకావిష్కరణ వినూత్నంగా జరిగింది. గత రాత్రి నుంచి తేలికపాటి జల్లులతో వర్షం కురుస్తోంది. తెల్లవారితే జెండా పండుగ జరుపుకోవాలి. బోద్దికూరపాడు గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ వేడుకలలో వింత పోకడ నెలకొంది. వర్షం పడుతున్నందువలన జాతీయపతాకం తడిచి పోతుందేమోనని పాఠశాల ఉపాధ్యాయులు పోల్ పై భాగాన గొడుగును ఏర్పాటు చేసి జెండాను ఎగురవేశారు. జాతీయ పతాకంపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఇవీ చదవండి