ETV Bharat / state

పూడిక తీసి.. సాగుకు మార్గం చూపలంటున్న ఆక్వా రైతులు

author img

By

Published : Mar 21, 2021, 3:44 PM IST

సముద్రానికి ఆటు పోట్లు ఉంటే కొన్ని రకాల సాగుకి అనుకూలం.. కానీ ఆటుపోట్లుకు ఇసుక మేటలు అడ్డంగా ఏర్పడ్డాయి. కాలువలు పూడిక పట్టి నీటి ప్రవాహం లేక నీరు కలుషితం అవుతుంది. ఆక్వా సాగుకు ఇది తీవ్ర ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. రొయ్యల చెరువులకు సహజ వనరులను వినియోగించుకోలేక పోవటం వల్ల రొయ్యకు వైరస్‌ సోకి దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

aqua farmers wanted canal open
పూడుకుపోయిన కాలువాలు

ప్రకాశం జిల్లా టంగుటూరు, సింగరాయ కొండ మండలాల సరిహద్దులో సముద్రంలో మూసి, పాలేరు కాలువలు కలుస్తాయి. సముద్రానికి ఆటుపోట్లు వల్ల కాలానుగుణంగా ఈ రెండు కాలువుల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరుతుంది. అదే విధంగా కాలువల్లో వచ్చే నీరు కూడా.. పోటుతో పాటు సముద్రంలోకి తీసుకువెళుతుంది. ఇది ప్రకృతి పరంగా జరిగే సహజ ప్రక్రియ.. పోటు సమయంలో ఈ రెండు కాలువుల్లో సుమారు 7 కి.మీ. వరకూ ఉప్పునీరు చేరుతుంది. ఈ నీటిని రైతులు ఆక్వా సాగుకు వినియోగిస్తారు.

కాలువలు సముద్రంలో కలిసేచోట ఇసుకమేటలు..

ఆక్వా చెరువుల ఖాళీ అయినప్పుడు వ్యర్థ జలాలు సైతం ఈ కాలువల ద్వారా సముద్రంలోకి చేరిపోయేవి. ప్రస్తుతం పాకాల సమీపంలో ఈ రెండు కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతంలో భారీగా ఇసుకమేటలు ఏర్పడ్డాయి. వీటివల్ల సముద్రం ఆటుపోట్ల సమయంలో కాలువల్లోకి ఉప్పునీరు రావడంలేదు. కాలువుల్లో ఉండే నీరు సముద్రంలో కలవడం లేదు. ఏళ్ళ తరబడి కాలువల్లో నీరు నిల్వలు పేరుకుపోయి కలుషితం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆక్వా రైతులు సొంతంగా ఒకటి రెండు సార్లు ఈ మేటల్ని తొలగించినా.. నెల రోజుల వ్యవధిలోనే పూడికుపోతుందని రైతులు వాపోతున్నారు.

రొయ్య పెరుగుదల నెమ్మదై.. పంట కాలం ఎక్కువై.. ఆర్ధిక భారం..

సహజసిద్దమైన ఉప్పునీరు కాలువల్లోకి రాకపోవడం వల్ల రైతులు బోర్లు వేసుకొని భూగర్భ జలాలు వినియోగించుకుంటున్నారు. నీటిని తోడేందుకు విద్యుత్తు వినియోగం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. అదే కాలువల్లో చేరే సముద్రం నీరు పట్టుకుంటే ఏ మాత్రం ఖర్చు అవదు. భూగర్భ జలాల్లో ఉప్పుశాతం తక్కువగా ఉండటం వల్ల రొయ్య పెరుగుదల నెమ్మదిగా.. పంట కాలం ఎక్కువగా ఉంటుంది.. ఇది కూడా రైతుకు ఆర్థిక భారాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

గతంలో రూ. 14 కోట్లతో కాలువల్లో పూడికతీత పనులు, ఇసుక మేటలు తీసేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకొని.. తమకు సాగుకు అనుకూలంగా కాలువలోని పూడికలు తీయించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి...

ఓ వైపు విద్యార్థుల ధర్నా..మరోవైపు ఆర్జీకేయూటీ కులపతి ఆదేశాలు

ప్రకాశం జిల్లా టంగుటూరు, సింగరాయ కొండ మండలాల సరిహద్దులో సముద్రంలో మూసి, పాలేరు కాలువలు కలుస్తాయి. సముద్రానికి ఆటుపోట్లు వల్ల కాలానుగుణంగా ఈ రెండు కాలువుల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరుతుంది. అదే విధంగా కాలువల్లో వచ్చే నీరు కూడా.. పోటుతో పాటు సముద్రంలోకి తీసుకువెళుతుంది. ఇది ప్రకృతి పరంగా జరిగే సహజ ప్రక్రియ.. పోటు సమయంలో ఈ రెండు కాలువుల్లో సుమారు 7 కి.మీ. వరకూ ఉప్పునీరు చేరుతుంది. ఈ నీటిని రైతులు ఆక్వా సాగుకు వినియోగిస్తారు.

కాలువలు సముద్రంలో కలిసేచోట ఇసుకమేటలు..

ఆక్వా చెరువుల ఖాళీ అయినప్పుడు వ్యర్థ జలాలు సైతం ఈ కాలువల ద్వారా సముద్రంలోకి చేరిపోయేవి. ప్రస్తుతం పాకాల సమీపంలో ఈ రెండు కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతంలో భారీగా ఇసుకమేటలు ఏర్పడ్డాయి. వీటివల్ల సముద్రం ఆటుపోట్ల సమయంలో కాలువల్లోకి ఉప్పునీరు రావడంలేదు. కాలువుల్లో ఉండే నీరు సముద్రంలో కలవడం లేదు. ఏళ్ళ తరబడి కాలువల్లో నీరు నిల్వలు పేరుకుపోయి కలుషితం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆక్వా రైతులు సొంతంగా ఒకటి రెండు సార్లు ఈ మేటల్ని తొలగించినా.. నెల రోజుల వ్యవధిలోనే పూడికుపోతుందని రైతులు వాపోతున్నారు.

రొయ్య పెరుగుదల నెమ్మదై.. పంట కాలం ఎక్కువై.. ఆర్ధిక భారం..

సహజసిద్దమైన ఉప్పునీరు కాలువల్లోకి రాకపోవడం వల్ల రైతులు బోర్లు వేసుకొని భూగర్భ జలాలు వినియోగించుకుంటున్నారు. నీటిని తోడేందుకు విద్యుత్తు వినియోగం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. అదే కాలువల్లో చేరే సముద్రం నీరు పట్టుకుంటే ఏ మాత్రం ఖర్చు అవదు. భూగర్భ జలాల్లో ఉప్పుశాతం తక్కువగా ఉండటం వల్ల రొయ్య పెరుగుదల నెమ్మదిగా.. పంట కాలం ఎక్కువగా ఉంటుంది.. ఇది కూడా రైతుకు ఆర్థిక భారాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

గతంలో రూ. 14 కోట్లతో కాలువల్లో పూడికతీత పనులు, ఇసుక మేటలు తీసేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకొని.. తమకు సాగుకు అనుకూలంగా కాలువలోని పూడికలు తీయించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి...

ఓ వైపు విద్యార్థుల ధర్నా..మరోవైపు ఆర్జీకేయూటీ కులపతి ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.