మొన్నటి వరకు కుకింగ్ ఏజెన్సీల ద్వారా పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్నా భోజనం వండి విద్యార్థులకు వడ్డించేవారు. ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ బాధ్యతలను ఏక్తా శక్తి అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి... అక్కడి నుంచే 25 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తుంది. ఈ నెల 3 నుంచి కార్యాచరణ అమల్లోకి వచ్చింది.
బోధనంపాడు జిల్లాపరిషత్ పాఠశాలకు పంపిన భోజనం చేదుగా ఉందని ప్రధానోపాధ్యాయుడు వెనక్కి పంపేశారు. ఈ చర్యతో 350 మంది విద్యార్థులు ఆకలితో పస్తులు ఉండాల్సి వచ్చింది. అదే ఆహారాన్ని సర్దుకుపోయి తిన్న పిల్లలు వాంతులు చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఇది ఒక్క బోధనంపాడు సమస్యకాదని... రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందంటున్నారు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు.
ఈ దుస్థితిపైనే ఈనాడు పత్రికలో "మాకొద్దు బాబోయ్ ఈ భోజనం" కథనం ప్రసారమైంది. స్పందించిన సిబ్బంది కాస్త నాణ్యమైన భోజనం సరఫరా చేసినట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు. ఇంకా మంచిగా ఆహారం అందివ్వాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి..చీరాల ప్రభుత్వాసుపత్రిలో ఉత్తమ డయాలసిస్ సేవలు..!