ETV Bharat / state

బోయినవారిపాలెంలో అగ్నిప్రమాదం.. 20 గడ్డివాములు దగ్ధం - 20 Haystack Stocks Burn at Boinavaripalem in Prakasam district

ప్రకాశం జిల్లా బోయినవారిపాలెం గ్రామంలో 20 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. ట్రాన్స్​ఫార్మర్​లో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఈపురుపాలెం ఎస్సై సుబ్బారావు తెలిపారు.

అగ్నికి ఆహుతైన 20 గడ్డివాములు
అగ్నికి ఆహుతైన 20 గడ్డివాములు
author img

By

Published : May 25, 2021, 5:24 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో 20 గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ గేదె సజీవదహనం కాగా.. అక్కడే ఉన్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఈపురుపాలెం ఎస్సై సుబ్బారావు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ మహిళను తన వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అంతలో అక్కడకి వచ్చిన బాపట్ల అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు.

మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

అగ్నిప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. మహిళను రక్షించడంలో ఎస్సై వ్యవహరించిన తీరుకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి..

విజయనగరం జిల్లాలో బ్లాక్​ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో 20 గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ గేదె సజీవదహనం కాగా.. అక్కడే ఉన్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఈపురుపాలెం ఎస్సై సుబ్బారావు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ మహిళను తన వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అంతలో అక్కడకి వచ్చిన బాపట్ల అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు.

మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

అగ్నిప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. మహిళను రక్షించడంలో ఎస్సై వ్యవహరించిన తీరుకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి..

విజయనగరం జిల్లాలో బ్లాక్​ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.