ETV Bharat / state

land scam: భూఅక్రమాలకు పాల్పడిన 12 మంది రెవెన్యూ అధికారులు సస్పెండ్

author img

By

Published : Aug 31, 2021, 4:51 PM IST

Updated : Aug 31, 2021, 10:12 PM IST

12 members of revenue officers suspended at markapuram
భూ అక్రమాలకు పాల్పడ్డ 12 మంది సస్పెండ్

16:48 August 31

ప్రకాశం జిల్లా మార్కాపురంలో 12 మంది రెవెన్యూ అధికారులపై వేటు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందిపై వేటు పడింది. ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన విశ్రాంత తహసీల్దార్ విద్యాసాగారుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. మార్కాపురం మండల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి కారణమైన 12 మంది వీఆర్వోలు, ఓ సర్వేయర్​ను సస్పెండ్ చెయ్యగా.. కంప్యూటర్ ఆపరేటర్​ను విధుల నుంచి శాశ్వతంగా తప్పించారు.

కోట్ల రూపాయల అవినీతి..

మార్కాపురం మండలం తహసీల్దార్​గా పనిచేసిన విద్యాసాగారుడు.. ఇటీవల పదవీ విరమణ పొందారు. ఇదే అదునుగా భావించిన కొందరు సిబ్బంది.. సదరు తహసీల్దార్​తో బేరాలు కుదుర్చుకున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములు కట్టబెట్టి రూ. కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారు.

విచారణకు ఆదేశం..

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సరళ వందనంను నియమించారు. దాదాపు రెండు నెలలపాటు మండలంలోని అన్ని గ్రామాల రికార్డులు పరిశీలించిన ఉన్నతాధికారులు.. నివేదికను కలెక్టర్​కు అందజేశారు.

ఆరోపణలు రుజువు కావడంతో..

ఆరోపణలు రుజువు కావడంతో అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకున్నారు. ఆర్ఐ గోపీతోపాటు మరో ఇద్దరు వీఆర్వోలు ఇటీవలే సస్పెన్షన్​కు గురయ్యారు. దీంతో మొత్తం 14 మంది వీఆర్వోలు సస్పెండయ్యారు.

ఇదీ చదవండి:

16:48 August 31

ప్రకాశం జిల్లా మార్కాపురంలో 12 మంది రెవెన్యూ అధికారులపై వేటు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందిపై వేటు పడింది. ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన విశ్రాంత తహసీల్దార్ విద్యాసాగారుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. మార్కాపురం మండల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి కారణమైన 12 మంది వీఆర్వోలు, ఓ సర్వేయర్​ను సస్పెండ్ చెయ్యగా.. కంప్యూటర్ ఆపరేటర్​ను విధుల నుంచి శాశ్వతంగా తప్పించారు.

కోట్ల రూపాయల అవినీతి..

మార్కాపురం మండలం తహసీల్దార్​గా పనిచేసిన విద్యాసాగారుడు.. ఇటీవల పదవీ విరమణ పొందారు. ఇదే అదునుగా భావించిన కొందరు సిబ్బంది.. సదరు తహసీల్దార్​తో బేరాలు కుదుర్చుకున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములు కట్టబెట్టి రూ. కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారు.

విచారణకు ఆదేశం..

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సరళ వందనంను నియమించారు. దాదాపు రెండు నెలలపాటు మండలంలోని అన్ని గ్రామాల రికార్డులు పరిశీలించిన ఉన్నతాధికారులు.. నివేదికను కలెక్టర్​కు అందజేశారు.

ఆరోపణలు రుజువు కావడంతో..

ఆరోపణలు రుజువు కావడంతో అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకున్నారు. ఆర్ఐ గోపీతోపాటు మరో ఇద్దరు వీఆర్వోలు ఇటీవలే సస్పెన్షన్​కు గురయ్యారు. దీంతో మొత్తం 14 మంది వీఆర్వోలు సస్పెండయ్యారు.

ఇదీ చదవండి:

Last Updated : Aug 31, 2021, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.