ETV Bharat / state

'రబీ సీజన్​లో 8లక్షల 10వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం'

రబీ సీజన్​లో 8లక్షల 10వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు... రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యదవ్ తెలిపారు. సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జలాశయాలు నీటితో నిండుకుండను తలపిస్తున్నాయన్నారు.

author img

By

Published : Nov 10, 2020, 2:13 PM IST

minister anil kumar yadav
'రబీ సీజన్​లో 8లక్షల 10వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం'


సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జలాశయాలు నీటితో నిండుకుండను తలపిస్తున్నాయని... రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహామండలి సమావేశంలో... మంత్రి అనిల్​తో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. రబీ సీజన్​లో 8లక్షల 10వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.

సోమశిల జలాశయం కింద పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో 5లక్షల ఎకరాలకు, కండలేరు జలాశయం కింద 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సాగునీరు వదిలేశామని, రేపటి నుంచి అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తామని మంత్రి అనిల్ తెలిపారు. కాలువల కూడా ముందుగానే రూ.4 కోట్ల 50 లక్షలతో పూడికలు తీయిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:


సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జలాశయాలు నీటితో నిండుకుండను తలపిస్తున్నాయని... రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహామండలి సమావేశంలో... మంత్రి అనిల్​తో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. రబీ సీజన్​లో 8లక్షల 10వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.

సోమశిల జలాశయం కింద పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో 5లక్షల ఎకరాలకు, కండలేరు జలాశయం కింద 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సాగునీరు వదిలేశామని, రేపటి నుంచి అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తామని మంత్రి అనిల్ తెలిపారు. కాలువల కూడా ముందుగానే రూ.4 కోట్ల 50 లక్షలతో పూడికలు తీయిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

ఆరోగ్యశ్రీ వైద్య సేవల విస్తరణ ప్రారంభించిన సీఎం జగన్‌..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.