ETV Bharat / state

VIRASAM Maha Sabhalu: నెల్లూరులో విరసం మహాసభలు.. పెద్దసంఖ్యలో పోలీసుల నిఘా! - ఏపీ తాజా వార్తలు

VIRASAM MahaSabhalu: రెండు తెలుగు రాష్ట్రాల విప్లవ రచయితల సంఘం(విరసం) మహాసభలు కోవూరులో ప్రారంభమయ్యాయి. రెండ్రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు.. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 200 మంది రచయితలు తరలివచ్చారు.

VIRASAM  MahaSabhalu:
VIRASAM MahaSabhalu:
author img

By

Published : Jan 8, 2022, 4:09 PM IST

VIRASAM Maha Sabhalu: నెల్లూరు జిల్లాలో రెండు తెలుగు రాష్ట్రాల విప్లవ రచయితల సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు నిర్వహించే 28వ విరసం మహా సభలకు వివిధ రాష్ట్రాల నుంచి రచయితలు తరలివచ్చారు. తొలుత నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కోవూరులోని సుందరయ్య భవన్​లో మహా సభలు ప్రారంభించారు. విరసం ఏర్పడి 52 ఏళ్లు గడిచిందని నిర్వహకులు తెలిపారు. ఈ సభలో 20 పుస్తకాలను ఆవిష్కరిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన పలువురు వక్తలు.. మోదీ ఆధిపత్య నిర్ణయాలను ఖండించారు. మరోవైపు సభ వద్ద ఇంటెలిజెన్స్, స్పెషల్​ బ్రాంచ్​తో పాటు స్థానిక పోలీసులు పెద్ద సంఖ్యలో నిఘా ఉంచారు.

ఇదీ చదవండి

VIRASAM Maha Sabhalu: నెల్లూరు జిల్లాలో రెండు తెలుగు రాష్ట్రాల విప్లవ రచయితల సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు నిర్వహించే 28వ విరసం మహా సభలకు వివిధ రాష్ట్రాల నుంచి రచయితలు తరలివచ్చారు. తొలుత నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కోవూరులోని సుందరయ్య భవన్​లో మహా సభలు ప్రారంభించారు. విరసం ఏర్పడి 52 ఏళ్లు గడిచిందని నిర్వహకులు తెలిపారు. ఈ సభలో 20 పుస్తకాలను ఆవిష్కరిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన పలువురు వక్తలు.. మోదీ ఆధిపత్య నిర్ణయాలను ఖండించారు. మరోవైపు సభ వద్ద ఇంటెలిజెన్స్, స్పెషల్​ బ్రాంచ్​తో పాటు స్థానిక పోలీసులు పెద్ద సంఖ్యలో నిఘా ఉంచారు.

ఇదీ చదవండి

Family suicide at vijayawada : విజయవాడలో.. తెలంగాణ కుటుంబం ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.