శ్రీహరికోటలోని సతీష్ధవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి... బుధవారం ఉదయం 9.28గంటలకు జరగనున్న పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం కావాలని... ఇస్రో ఛైర్మన్ శివన్ సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. పీఎస్ఎల్వీ -సీ47 కౌంట్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రయోగం రక్షణపరమైన భూ పరిశోధనకు పని చేస్తుందని తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగం పనులు జరుగుతున్నాయని 2020లో ప్రయోగిస్తామని వివరించారు.
ఇదీ చదవండి : 'ఏం చేశారని కడప జిల్లాలో పర్యటిస్తున్నారు..?'