ETV Bharat / state

అమరావతి రైతులకు మద్దతుగా నెల్లూరులో తెదేపా నిరసన - అమరావతి రైతుల 300 రోజుల దీక్షలు

అమరావతి రైతుల 300 రోజుల నిరసనలకు మద్దతుగా నెల్లూరు జిల్లా తెదేపా నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...నల్లరిబ్బన్​లతో నిరసనలు తెలిపారు.

నెల్లూరులో అమరావతి మద్దతు ర్యాలీలు
నెల్లూరులో అమరావతి మద్దతు ర్యాలీలు
author img

By

Published : Oct 12, 2020, 4:06 PM IST

అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని నెల్లూరు తెదేపా నేతలు విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమం 300 రోజులు చేరిన సందర్భంగా నెల్లూరులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని వ్యతిరేకించని జగన్.., ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులనటం సరికాదని నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు హితవు పలికారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ..,అమరావతినే రాజధానిగా కొనసాగించే వరకు తెదేపా పోరాడుతుందని వ్యాఖ్యనించారు.

పంథాలతో మూడు రాజధానుల ప్రకటన

అమరావతి రైతులకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే...పంథాలతో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చిందని రామకృష్ణ మండిపడ్డారు.

అమరావతి రైతులను మోసం చేశారు

ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరావతి రైతులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అమరావతి రైతులకు సంఘీభావంగా స్థానిక తహశీల్దార్​కు వినతిపత్రం అందించారు.

ఇదీచదవండి

అమరావతి ఉద్యమం @ 300

అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని నెల్లూరు తెదేపా నేతలు విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమం 300 రోజులు చేరిన సందర్భంగా నెల్లూరులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని వ్యతిరేకించని జగన్.., ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులనటం సరికాదని నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు హితవు పలికారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ..,అమరావతినే రాజధానిగా కొనసాగించే వరకు తెదేపా పోరాడుతుందని వ్యాఖ్యనించారు.

పంథాలతో మూడు రాజధానుల ప్రకటన

అమరావతి రైతులకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే...పంథాలతో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చిందని రామకృష్ణ మండిపడ్డారు.

అమరావతి రైతులను మోసం చేశారు

ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరావతి రైతులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అమరావతి రైతులకు సంఘీభావంగా స్థానిక తహశీల్దార్​కు వినతిపత్రం అందించారు.

ఇదీచదవండి

అమరావతి ఉద్యమం @ 300

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.