ETV Bharat / state

'రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది'

author img

By

Published : Jun 18, 2020, 9:36 PM IST

శాసన మండలిలో వైకాపా మంత్రుల వ్యవహర శైలిపై ప్రజల్లో ఆందోళన నెలకొందని తెదేపా నేత రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు.

tdp leader reacts on ycp government
వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా నేత రామకృష్ణ వ్యాఖ్యలు

రాష్ట్రంలో వైకాపా పాలన అప్రజాస్వామికంగా ఉందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు. శాసన మండలిలో ప్రజాప్రతినిధుల తీరును ప్రజలకు ప్రత్యక్షంగా తెలిపే టీవీ ఛానళ్లకు అభ్యంతరాలు చెప్పడం ఏమిటని నెల్లూరులో ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. మండలిలో నారా లోకేశ్​​పై మంత్రులు దౌర్జన్యానికి దిగితే అడ్డుకోబోయిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్రపైన దాడి చేశారని ఆరోపించారు. దీనికి 100శాతం వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

రాష్ట్రంలో వైకాపా పాలన అప్రజాస్వామికంగా ఉందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు. శాసన మండలిలో ప్రజాప్రతినిధుల తీరును ప్రజలకు ప్రత్యక్షంగా తెలిపే టీవీ ఛానళ్లకు అభ్యంతరాలు చెప్పడం ఏమిటని నెల్లూరులో ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. మండలిలో నారా లోకేశ్​​పై మంత్రులు దౌర్జన్యానికి దిగితే అడ్డుకోబోయిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్రపైన దాడి చేశారని ఆరోపించారు. దీనికి 100శాతం వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చూడండి:వెన్నుపూస విరిగిన వ్యక్తికి ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.